Shuru
Apke Nagar Ki App…
డీజిల్ కొరత లేదు... గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రకటన Shot News:జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరతపై జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ వివరణ ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయిన కారణంగా కొండపల్లి డిపో నుంచి డీజిల్ సరఫరా జరగలేదని చెప్పారు. సోమవారం ఉదయం కల్లా అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా డీజిల్ కొరత ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
SHOT NEWS
డీజిల్ కొరత లేదు... గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రకటన Shot News:జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరతపై జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ వివరణ ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయిన కారణంగా కొండపల్లి డిపో నుంచి డీజిల్ సరఫరా జరగలేదని చెప్పారు. సోమవారం ఉదయం కల్లా అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా డీజిల్ కొరత ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అమరావతి:రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జన్మదిన వేడుకలు అమరావతి పట్టణ ప్రజలు సోమవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అమరావతి రాజధానిగా కృష్ణా,గుంటూరు ప్రాంతంలో పరిపాలించిన జమీందారు ప్రసిద్ధి పొందిన ప్రభువు రాజా వాసిరెడ్డి అని వక్తలు కొనియాడారు.కవి పండిత పోషకుడు,మంచి పరిపాలనా దక్షుడు,వందకు పైగా దేవాలయాలు నిర్మించిన ప్రభువు వాసిరెడ్డి అన్నారు.1
- Post by V Ramarao2
- Post by CHIYAAN1
- కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.1
- *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.1
- వేసవి డిమాండ్తో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు నష్టాలను చూసిన రైతులకు భారీ ఊరట దక్కింది. APలో నిమ్మకు ప్రసిద్ధిగాంచిన గూడూరు(నెల్లూరు) లో మొదటిరకం కాయలు రికార్డుస్థాయిలో కేజీకి రూ.210 పలుకుతున్నాయి. ఇవి కేజీకి 20-22 కాయలు వస్తాయి. ఇటీవల వర్షాలకు నిమ్మ పూత, పిందెలు రాలిపోయాయని లేకుంటే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. అటు TGలోని కరీంనగర్ లోనూ కేజీ రూ.200 పలుకుతోంది1
- నల్లగొండ బ్రేకింగ్: _నాగార్జునసాగర్లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి.. విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం.. “అప్పు ఇచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం.. బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ.. తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..2
- NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.1