Shuru
Apke Nagar Ki App…
పాణ్యం MEO కోటయ్యపై చర్యలు తీసుకోవాలి: PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు పనివేళల్లో కార్యాలయానికి తాళం వేసి గైరాజరైన పాణ్యం MEO కోటయ్యపై చర్యలు తీసుకోవాలని PDSU నేత రాంబాబు అన్నారు. ఈ మేరకు పాణ్యంలోని పలు సమస్యలపై సోమవారం MEO కార్యాలయానికి తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థుల సమస్యలను అర్జీలు స్వీకరించే రోజా అధికారులు విధుల్లో లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. చర్యలు తీసుకోవాలని DEOకు ఫిర్యాదు చేశారు.
Why not dinesh... yashaswi
పాణ్యం MEO కోటయ్యపై చర్యలు తీసుకోవాలి: PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు పనివేళల్లో కార్యాలయానికి తాళం వేసి గైరాజరైన పాణ్యం MEO కోటయ్యపై చర్యలు తీసుకోవాలని PDSU నేత రాంబాబు అన్నారు. ఈ మేరకు పాణ్యంలోని పలు సమస్యలపై సోమవారం MEO కార్యాలయానికి తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థుల సమస్యలను అర్జీలు స్వీకరించే రోజా అధికారులు విధుల్లో లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. చర్యలు తీసుకోవాలని DEOకు ఫిర్యాదు చేశారు.
More news from Andhra Pradesh and nearby areas
- నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.1
- పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.1
- కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.1
- అలంపూర్: ట్రాన్స్ఫారం కు కంచె ఏర్పాటు చేయండి!!!స్థానికుల వినతి... అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న మండల మహిళా సమైక్య భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫారంకు కంచె లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అటుగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫారంకు కంచె ఏర్పాటు చేసి ప్రమాదం జరగకముందే స్పందించాలని కోరుతున్నారు.1
- బిజెపి ఆధ్వర్యంలో నాలుగు మాడవీధులలో 100 అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శించిన విద్యార్థులు మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో నాలుగు మాడవీధులలో జాతీయ జెండాను ప్రదర్శించారు1
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెంలో విద్యుత్ శాఖ ఉద్యోగి రాజా షేక్ మృతి చెందారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సీపీఎం బృందం మృతదేహాన్ని పరిశీలించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని సీపీఎం నేత నాగేశ్వరరావు ఆరోపించారు.1