మహాత్మా నగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...నవ వరుడు మృతి... మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ వద్ద రాజీవ్ రాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మానగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రానాప్రతాప్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్, కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహం అయింది. కాళ్ళ పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళింట విషాదం అలుముకుంది.
మహాత్మా నగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...నవ వరుడు మృతి... మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ వద్ద రాజీవ్ రాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మానగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రానాప్రతాప్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్, కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహం అయింది. కాళ్ళ పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళింట విషాదం అలుముకుంది.
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ లో భీమేశ్వర ఆలయంలో రాజన్నను భక్తులు దర్శించుకుని ఆలయంలో కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.1
- వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ వద్ద రాజీవ్ రాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో నవ వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీలో పనిచేసే కోటిరెడ్డి కరీంనగర్ నుంచి బస్సులో వచ్చి మహాత్మానగర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రానాప్రతాప్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి అర్జున్, కోటిరెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాణా ప్రతాప్ కు వారం రోజుల క్రితమే వివాహం అయింది. కాళ్ళ పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళింట విషాదం అలుముకుంది.1