Shuru
Apke Nagar Ki App…
తిమ్మాపూర్ మండల మహాత్మా నగర్ లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
తిమ్మాపూర్ మండల మహాత్మా నగర్ లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మాజీమంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు, పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- Post by Venu Gopal1
- ప్రభావశీలురైన నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రాణభయంలో బాధితుడి కుటుంబం. మంచిర్యాల/జన్నారం: చట్టం ముందు అందరూ సమానులే అని పాలకులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ ప్రభావం, ధనబలం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఒక ఎస్సీ బాధితుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటన నేపథ్యం: ఫిర్యాదు చేసినా తప్పించుకున్న పోలీసులు ఫిబ్రవరి 16, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో నస్పూర్ మోషే అనే వ్యక్తిపై కులం పేరుతో దాడి జరిగింది. బాధితుడి కుమారుడు అభినయ్ వెంటనే '100' కు నాలుగు సార్లు కాల్ చేసినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. మరుసటి రోజు (ఫిబ్రవరి 17) బాధితుడి భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, జన్నారం ఎస్హెచ్ఓ గొల్లపెల్లి అనూష ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా, నిందితుల ఒత్తిడితో బాధితుడిపైనే ఎదురు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చుట్టూ తిరిగినా అందని న్యాయం న్యాయం కోసం బాధితురాలు ఫిబ్రవరి 23న మంచిర్యాల డీసీపీని ఆశ్రయించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విచారణకు రావడానికి మరో 12 రోజుల సమయం పట్టింది. చివరకు దాడి జరిగిన 18 రోజుల తర్వాత (మార్చి 6, 2026) ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 49/2026) నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే స్పందించాల్సి ఉన్నా, ఈ స్థాయిలో ఆలస్యం జరగడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడి నేర చరిత్ర – రాజకీయ రక్షణ ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లం రవి, ప్రస్తుత సర్పంచ్ భర్త మరియు మాజీ ఎంపీటీసీ. ఇతనిపై గతంలోనే పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి: SC Spl. 25/2022: ఆదిలాబాద్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు. SC Spl. 19/2018 (FIR 128/2017): గతంలో జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, తనకున్న రాజకీయ మరియు ధన బలంతో నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రాణభయంలో బాధితుడి కుటుంబం మార్చి 11న రామగుండం పోలీస్ కమిషనర్ను కలిసిన బాధితురాలు, నిందితులు తమను రాజీ పడాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. ఎఫ్ఐఆర్ నమోదై ఇన్ని రోజులైనా నిందితుడు అల్లం రవి, అల్లం సూరిలు బహిరంగంగానే తిరుగుతున్నారని, ఇది బాధితులను మరింత భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్: "ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధితుడి కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, విచారణలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి."2
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని గంగారం తండాకు చెందిన రైతు తేజావత్ నరహరి లేగదూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఉదయం పశువులను చూసేందుకు వెళ్లిన రైతులు ఈ ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. వరుసగా పెద్దపులి సంచారం వార్తలు వెలువడుతుండటంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది2