రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు.. నియోజకవర్గానికి చేరిన తుంగభద్ర జలాలు రాయదుర్గం: నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయదుర్గం పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు తీపికబురు అందించారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడంతో కణేకల్ ఎస్ఎస్ ట్యాంక్కు నీటిని తరలించి నిల్వ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని అందుబాటులో ఉన్న యంత్రాల సహాయంతో ట్యాంక్కు పంపింగ్ చేసి నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఎస్ఎస్ ట్యాంక్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణంలో తాగునీటి సరఫరాపై కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్ఎల్సీ కాలువకు నీరు చేరడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్లో అవసరమైన స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజలు నీటి సరఫరాపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు సమకూరిన వెంటనే మరో వారం రోజుల్లో గతంలో మాదిరిగానే యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. హెచ్ఎల్సీ జలాల రాకతో పట్టణ ప్రజల్లో నీటి సమస్యపై నెలకొన్న ఆందోళనకు తెరపడే అవకాశం ఏర్పడింది.
రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు.. నియోజకవర్గానికి చేరిన తుంగభద్ర జలాలు రాయదుర్గం: నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయదుర్గం పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు తీపికబురు అందించారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడంతో కణేకల్ ఎస్ఎస్ ట్యాంక్కు నీటిని తరలించి నిల్వ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని అందుబాటులో ఉన్న యంత్రాల సహాయంతో ట్యాంక్కు పంపింగ్ చేసి నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఎస్ఎస్ ట్యాంక్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణంలో తాగునీటి సరఫరాపై కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్ఎల్సీ కాలువకు నీరు చేరడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్లో అవసరమైన స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజలు నీటి సరఫరాపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు సమకూరిన వెంటనే మరో వారం రోజుల్లో గతంలో మాదిరిగానే యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. హెచ్ఎల్సీ జలాల రాకతో పట్టణ ప్రజల్లో నీటి సమస్యపై నెలకొన్న ఆందోళనకు తెరపడే అవకాశం ఏర్పడింది.
- రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు.. నియోజకవర్గానికి చేరిన తుంగభద్ర జలాలు రాయదుర్గం: నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయదుర్గం పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు తీపికబురు అందించారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ప్రారంభం కావడంతో కణేకల్ ఎస్ఎస్ ట్యాంక్కు నీటిని తరలించి నిల్వ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని అందుబాటులో ఉన్న యంత్రాల సహాయంతో ట్యాంక్కు పంపింగ్ చేసి నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఎస్ఎస్ ట్యాంక్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణంలో తాగునీటి సరఫరాపై కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్ఎల్సీ కాలువకు నీరు చేరడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్లో అవసరమైన స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజలు నీటి సరఫరాపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు సమకూరిన వెంటనే మరో వారం రోజుల్లో గతంలో మాదిరిగానే యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. హెచ్ఎల్సీ జలాల రాకతో పట్టణ ప్రజల్లో నీటి సమస్యపై నెలకొన్న ఆందోళనకు తెరపడే అవకాశం ఏర్పడింది.1
- సత్యసాయి జిల్లా సికేపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో రాత్రి వర్షం కురిసింది రాప్తాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది గత నెల రోజులుగా ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లి పోయినారు ప్రస్తుతం కురిసిన వరుస కొంతమేరకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోంది ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి వర్షం కోసం బోనాలు పట్టారు నీళ్లు పోయడం జరిగింది1
- కర్నూలు-ఆదోని మార్గంలో బస్సుల కొరత...ఇదీ పరిస్థితి...! కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలాసేపటి తర్వాత ఒక్క బస్సు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కడానికి గుంపులుగా ఎగబడ్డారు. బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరారు. కర్నూలు-ఆదోని మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.1
- ఎమ్మిగనూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు.. అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన బీజేపీ నేతలు1
- ఎమ్మిగనూరు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకలు* ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాల్మీకి దయాసాగర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేద్కర్ సొసైటీ చిన్నపిల్లల అనాధాశ్రమం నందు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురవబడేసాబ్ గారు పట్టణ సీనియర్ నాయకులు శివదాస్ గారు రవి కిరణ్ గారు, శ్రీ చక్ర నాగరాజు గారు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వడ్డే ఉరుకుందు గారు, మల్లికార్జున ఆచారి,19 వార్డ్ ఇంచార్జ్ పట్టణ కోశాధికారి శిల్పి భాస్కర్ గారు, BJYM జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి,BJYM పట్టణ అధ్యక్షులు ఉప్పర బండి రాజేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి చేనేత శివ ,పట్టణ ఉపాధ్యక్షులు కాసిం నాయుడు, వెల్డింగ్ వెంకటేష్ ,వడ్డే బజారి మాల మార్కండేయ గార్లు, పట్టణ నాయకులు వడ్డే పెద్దయ్య, వడ్డే మహేష్, బి రవి కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం గతకొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- ఓటర్ల అభ్యర్థనలు, అభ్యంతరాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏ ఈ ఆర్ ఓ శంకర్ రెడ్డి కణేకల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) ప్రక్రియలో భాగంగా 148–రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కణేకల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, హియరింగ్లు, అభ్యర్థనలు, అభ్యంతరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఏఈఆర్ఓ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఓటర్ల జాబితాలో పేర్లకు సంబంధించి వచ్చిన అభ్యర్థనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై చేపట్టిన హియరింగ్ ప్రక్రియ, అందిన అభ్యంతరాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని,ప్రతి అభ్యర్థనను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఏఈఆర్ఓ శంకర్రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా,అనర్హులైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల మేరకు సరిదిద్దేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.1
- త్వరిత గతిన హత్య కేసును చేదించినధర్మవరం పోలీసులు... ముగ్గురు అరెస్ట్ ధర్మవరం మండలం ఓబులనయనిపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు ఈ నెల 7న చెరువు కట్ట వద్ద హత్యకు గురయ్యారని డీఎస్పీ జగన్నాథ్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ నేత గంగాధర్ నాయుడు, చరణ్, జి. గంగాధర్ కలిసి బోయ శ్రీనివాసులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి మహేంద్ర వాహనం, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.1