Shuru
Apke Nagar Ki App…
కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ, నంద వేమారెడ్డిని ప్రశంసిస్తున్న స్థానికులు గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.
Srivartha news
కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ, నంద వేమారెడ్డిని ప్రశంసిస్తున్న స్థానికులు గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.
More news from Annamayya and nearby areas
- *📰 టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి – సుగవాసి ప్రసాద్ బాబు* రాయచోటి 28 మార్చి 2026: తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీకి రేపు 29-03-2026 (ఆదివారం) నాటికి 44 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల ఆశయాల కోసం పుట్టిన ఉద్యమమని, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల మేలు, మహిళల సాధికారత, యువతకు ఉద్యోగావకాశాలే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలు మేరకు, 👉 ప్రతి కార్యకర్త తన ఇంటి పై టీడీపీ పసుపు జెండాను ఎగరేసి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను చాటాలని కోరారు. అలాగే గ్రామ గ్రామాన పార్టీ కార్యాలయాల వద్ద, దిమ్మెల వద్ద జెండా ఎగరేసి, శుభ్రత కార్యక్రమాలు నిర్వహించి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అమలు చేశారని, భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా టీడీపీ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ ఐక్యంగా నిలబడి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ✍️ ఇట్లు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు2
- పలమనేరు గంటఊరు తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంత ప్రజలు అందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని,పంటలు బాగా పండాలని, పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సోమచంద్రారెడ్డి, హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, నవీన్, ప్రహల్లాద, చెంగారెడ్డి తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బస్సుల ముమ్మర తనిఖీలు చేస్తున్న అధికారులు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పలమనేరు జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా ఎన్పోస్మెంట్ అధికారి సుప్రియ గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ ఆధ్వర్యంలో బస్సుల తనిఖీ నిర్వహించారు కర్నూలు బస్సు ప్రమాదం, మార్కాపురం బస్సు ప్రమాదం దృష్టిలో పెట్టుకొని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రయాణికులకు సూచనలు కల్పించారు అదేవిధంగా బస్సు యాజమాన్యం ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ ఉపయోగిస్తున్నారు అది అందుబాటులో ఉన్నాయా లేదా బస్సులో స్థానికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంటాయి ఏ విధంగా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించుకోవాలి అనే అంశం పైన ప్రయాణికులకు సూచనలు కల్పించారు ఈ సందర్భంగా సుప్రియ మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం కర్నూలు బస్సు సంఘటనలు నిర్లక్ష్యప్రాయంగా జరిగినవని అలా జరగకుండా ఉండడానికి బస్సులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పరిచిన ప్రికాషన్స్ ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనే అంశం పై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగవరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- ఏపీ పునర్విభజన చట్టం సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యాన్ని ఆయన వివరించారు.విభజన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి అత్యంత పవిత్రమైన నేల అని ఆయన కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.1
- “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని వేదయపాలెం సమీపంలో జ్యోతి నగర్ నందు మిస్టర్ చాయ్ ఫ్రాంచెస్ గొప్ప ప్రారంభం వేదయపాలెం జ్యోతి నగర్ మూడో వీధి నందు అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా మిస్టర్ చాయ్ స్నాక్స్ అండ్ బేవరేజెస్ ఫ్రాంచెస్ గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్ బి ఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కిరణ్ మరియు రమేష్ హాజరవ్వటం జరిగిందని తెలిపారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి స్మోక్ ఫ్రీ టి కెఫెస్ను నెల్లూరులో ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అంటూ నిర్వాహకులు మాలపాటి అభిషేక్ను అభినందించారు. కావున నెల్లూరు చాయి ప్రియులు ఒకసారి తమ మిస్టర్ చాయ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కోరారు. తమ వద్ద అన్ని రకాల మిల్క్ షేక్స్ టీ కాఫీ పొజిటోస్ స్నాక్స్ నాణ్యమైన క్వాలిటీతో సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉంటాయని కావున ఒకసారి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.4
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- అన్నమయ్య జిల్లా :- మదనపల్లె *ఎగ్జామ్ మధ్యలో పాము కాటు… అయినా రాసిన విద్యార్థిని మదనపల్లెలో ఘటన* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ విద్యార్థిని అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో పాము కాటుకు గురైనప్పటికీ, పరీక్షను మధ్యలో ఆపకుండా పూర్తి చేసింది. మదనపల్లె బసినికొండకు చెందిన అఫ్రన్ (14) అనే విద్యార్థిని 7 హిల్స్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈరోజు జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షకు హాజరైన ఆమె, పరీక్ష రాస్తున్న సమయంలో పాము కాటు గురైంది. అయితే, “ఏమి కాలేదు” అంటూ ధైర్యంగా స్పందించిన అఫ్రన్, ఇన్విజిలేటర్కు సమాచారం ఇచ్చినా పరీక్షను ఆపకుండా కొనసాగించింది. పరిస్థితిని అంచనా వేసిన సిబ్బంది కూడా పరీక్ష పూర్తి చేయడానికి ఆమెకు అనుమతి ఇచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం వెంటనే కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది కలిసి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అఫ్రన్ చూపిన ధైర్యం, పట్టుదలపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.1