Shuru
Apke Nagar Ki App…
డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ అత్యంత ప్రాధాన్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలలోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన వార్త లాప్ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Sangareddy News
డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ అత్యంత ప్రాధాన్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలలోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన వార్త లాప్ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
More news from తెలంగాణ and nearby areas
- డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ అత్యంత ప్రాధాన్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలలోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన వార్త లాప్ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.1
- శివంపేట్ మండలంలోని Bharat Petroleum కు చెందిన Bharatgas ఏజెన్సీ వద్ద ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ప్రజలు సిలిండర్లతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం నుంచే చిన్న పిల్లలు, మహిళలు లైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తుండటం స్థానికులను కలచివేస్తోంది. సరఫరా లోపం, నిర్వాహక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- Jai jai BRS TRS 🚙🚙🚙🌹💐🪴💯4
- గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ విద్యార్థులు కాలేజీలో ప్రాక్టికల్ లేదు..ప్రాక్టీసు లేదు అంటూ ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు రారు. ప్రాక్టీస్ చేసేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... కళాశాల ముందు ప్లకార్ట్స్ పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓయూ ఉన్నతాధికారులు స్పందించి ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు క్లాసులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో విసీ చాంబర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఉప్పల్ శిల్పరామం వద్ద చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు ఇబ్బందులు హైదరాబాద్లోని ఉప్పల్ శిల్పరామం సమీప రోడ్డుపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం తర్వాత చెత్త పేరుకుపోయి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ శుభ్రపరచలేదు. ప్లాస్టిక్ కవర్లు, ఆహార అవశేషాలు రోడ్డుపై ఉండటంతో దుర్వాసన వస్తూ స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరచాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.1
- Post by Anji Raju1
- మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు భారీగా చేరుకుని నిరసన చేపట్టగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి, ఇతర ఖర్చుల కోసం రూ.50,000 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాలను ఛేదించి 48 గంటల నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు తమ సమస్యలను కలెక్టరేట్కు విన్నవించేందుకు వెళ్లగా, అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని హెచ్చరిస్తూ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు రేవతి, అనిత, ఐ. రాజశేఖర్, బి. లింగస్వామి, పి. గణేష్, ఆర్. సంతోష్, ఎం. నరేష్, శంకరమ్మ, రమ, సబియా, పద్మ, వసంత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.3
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 17 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా : శ్రీ చైతన్య సెంటిపీటర్స్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాల బస్ ఢీకొని ఒక్కరి మృతి,మరొకరి పరిస్థితి విషమం. జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారు రాజీవ్ రహదారిపై ఘటన. * జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారులో బైక్ ను ఢీ కొన్న శ్రీ చైతన్య సెంటిపీటర్స్ ప్రైవేట్ పాఠశాల బస్ * బైక్ పై వెళ్తున్న జగదేవ్ పూర్ కి చెందిన ఆలకుంట రమేష్(48) అక్కడిక్కడే మృతి * మరో వ్యక్తి మల్లయ్య(70) పరిస్థితి విషమం * అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలింపు.4