రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి -నేడు హైదరాబాదులో అంత్యక్రియలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామం. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతులను గావించి గద్దెనెక్కిన ఆయన 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. పాఠశాల విద్యను దోనేపూడిలో పూర్తిచేసిన ఆయన కళాశాల విద్యను బందరు హిందూ కళాశాలలో పూర్తిచేసి, హైదరాబాదులో లా పూర్తి చేశారు. 1968 నుంచి 1978 వరకు న్యాయవాదిగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలలో ప్రవేశించారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదుపరి 1983లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీలో చేరి వేమూరు శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 1989 తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మూడుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెనాలితో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. చివరిగా ఆయన 1998లో ఖమ్మం ఎంపీగా ఎన్నికైన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన తన కుమారుడు నాదెండ్ల మనోహర్ ను 2004, 2009 ఎన్నికలలో తెనాలి శాసనసభ్యునిగా గెలిపించుకున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మనోహర్ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ గా కూడా పనిచేశారు. తదుపరి వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందిన మనోహర్ 2024లో జనసేన తరఫున గెలిచి, ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. భాస్కరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మనోహర్ ఎన్నికల సమయంలో తెనాలిలో పాగా వేసేవారు. ఆయనకున్న విస్తృత పరిచయాలతో సామాజిక సమీకరణాలతో ఓటర్లను ఆకర్షించేవారు. రాజకీయ విశ్లేషణలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అభిమానులు, నాయకుల సందర్శనార్థం భాస్కరరావు మృతదేహాన్ని జూబ్లీహిల్స్ స్వగృహంలో ఉంచారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ పంజాగుట్ట హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి -నేడు హైదరాబాదులో అంత్యక్రియలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామం. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతులను గావించి గద్దెనెక్కిన ఆయన 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. పాఠశాల విద్యను దోనేపూడిలో పూర్తిచేసిన ఆయన కళాశాల విద్యను బందరు హిందూ కళాశాలలో పూర్తిచేసి, హైదరాబాదులో లా పూర్తి చేశారు. 1968 నుంచి 1978 వరకు న్యాయవాదిగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలలో ప్రవేశించారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదుపరి 1983లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీలో చేరి వేమూరు శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 1989 తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మూడుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెనాలితో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. చివరిగా ఆయన 1998లో ఖమ్మం ఎంపీగా ఎన్నికైన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన తన కుమారుడు నాదెండ్ల మనోహర్ ను 2004, 2009 ఎన్నికలలో తెనాలి శాసనసభ్యునిగా గెలిపించుకున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మనోహర్ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ గా కూడా పనిచేశారు. తదుపరి వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందిన మనోహర్ 2024లో జనసేన తరఫున గెలిచి, ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. భాస్కరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మనోహర్ ఎన్నికల సమయంలో తెనాలిలో పాగా వేసేవారు. ఆయనకున్న విస్తృత పరిచయాలతో సామాజిక సమీకరణాలతో ఓటర్లను ఆకర్షించేవారు. రాజకీయ విశ్లేషణలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అభిమానులు, నాయకుల సందర్శనార్థం భాస్కరరావు మృతదేహాన్ని జూబ్లీహిల్స్ స్వగృహంలో ఉంచారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ పంజాగుట్ట హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
- కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.1
- Post by Syyed taher1
- 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”1
- Post by V Ramarao1
- మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు1
- నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.1
- గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.1
- Post by Syyed taher1