మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు మామునూరు, సెప్టెంబర్ 02: మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.
మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు మామునూరు, సెప్టెంబర్ 02: మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల
నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.
- మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు మామునూరు, సెప్టెంబర్ 02: మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.2
- తొలగించాడు.. పోలీసుల ముందు నివాళులర్పించాడు! రాజశేఖర్రెడ్డి చిత్రపటం తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం.. పోలీసుల జోక్యంతో వివాదానికి తెర రాజశేఖర్రెడ్డి చిత్రపటం తొలగింపుతో దంతాలపల్లిలో ఉద్రిక్తత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి చిత్రపటాన్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అయితే కొద్దిసేపటికే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆ చిత్రపటాన్ని తొలగించినట్లు కాంగ్రెస్ నాయకుల దృష్టికి వచ్చింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి సదరు వ్యక్తిని తీసుకువచ్చారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకు తొలగించిన చిత్రపటాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయించి, అతని చేతుల మీదుగా రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించించారు. దీంతో కొంతసేపు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి.చిత్రపటం తొలగింపు ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్రపటం తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు సదరు వ్యక్తితోనే నివాళులు అర్పించడంతో కాంగ్రెస్ నాయకులు శాంతించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.4
- నర్సంపేట గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ సమరభేరి 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అటకెక్కిన ఆరు గ్యారెంటీలు ఎగవేసిన హామీలు. అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.... రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.1
- నర్సంపేట: పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ నర్సంపేట: పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని, సభ్యుల సంక్షేమం, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.3
- బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటి ఇంటికీ పంపిణీ చేసారు.బుధవారం ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు,హామీల అమలు కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం కాంగ్రెస్ దగా పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా..! 420 దొంగ హామీలకు — 420 అడుగుల బ్యానర్తో వినూత్న నిరసన..! మాటల మాయకు — ప్రజల గళంతో సమాధానం..! హామీల మోసానికి — ఉద్యమాల ఉప్పెన..! ✊ వాగ్దానాలు ఎన్నో… అమలు మాత్రం శూన్యం… ఎన్నికల ముందు హామీల వర్షం… అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిర్లక్ష్యం..! ఆరు గ్యారెంటీలు ఎక్కడ..? రైతు భరోసా ఏమైంది..? మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? యువతకు ఉద్యోగాల మాట ఏమైంది..? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ కలిసిపోయాయి..? 🔥 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ శ్రేణులు..! 🔥 420 హామీల అమలు కోసం గర్జించిన ప్రజాగళం..! కుత్బుల్లాపూర్ గడ్డమీద ఉద్యమం ఎగిసింది..! ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలైంది..! కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన బీఆర్ఎస్ శ్రేణులు..! హామీలు కాదు — అమలు కావాలి..! దగా కాదు — ప్రజలకు న్యాయం కావాలి..!1
- నర్సంపేట: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ధర్నా........... నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్ రోడ్డు జంక్షన్) వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం...భార్య అత్త పై కత్తితో దాడి చేసిన భర్త...భార్య మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం జరిగింది. భార్య, ఆమే తల్లి పై కత్తితో భర్త సురేష్ దాడి చేశారు. భార్య జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అత్త ఎల్లవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. సురేష్, జ్యోతి కి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వివాహం కాగా గత ఏడు నెలలుగా తల్లిగారింట్లోనే జ్యోతి ఉంటున్నారు. జ్యోతి ఆమె తల్లి ఎల్లవ్వ ఇద్దరు ఆసుపత్రి వెళ్ళే క్రమంలో పదిర వద్ద రోడ్డుపైనే కారులో వచ్చి భర్త సురేష్ కత్తితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన జ్యోతికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ సిరిసిల్ల స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.4