Shuru
Apke Nagar Ki App…
నర్సంపేట: పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ నర్సంపేట: పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని, సభ్యుల సంక్షేమం, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Chetty:Ramesh
నర్సంపేట: పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ నర్సంపేట: పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని, సభ్యుల సంక్షేమం, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నర్సంపేట గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ సమరభేరి 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అటకెక్కిన ఆరు గ్యారెంటీలు ఎగవేసిన హామీలు. అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.... రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.1
- నర్సంపేట: పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ నర్సంపేట: పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని, సభ్యుల సంక్షేమం, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.3
- ములుగు గడ్డపై గుబాలించిన గులాబీ జెండా - కాంగ్రెస్ ప్రభుత్వం పై మొదలైన నిరసనలు - 420 ఫీట్ల ఫ్లెక్సీ తో భారీ ర్యాలీ : బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, నియోజకవర్గ ఇన్చార్జి నాగజ్యోతి ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 02 (భారత శక్తి) : తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసిన ములుగు గడ్డపై గులాబీ జెండా గుబాలించింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్న కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని 163 వ జాతీయ రహదారిపై 420 ఫీట్ల తో కాంగ్రెస్ పార్టీ హామీలు గుర్తు చేసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ ఎస్ ములుగు అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావుములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతిలు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాసేపు చేపట్టిన నిరసనకార్యక్రమంలో వారు మాట్లాడారు. అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ గడ్డపై నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గులాబీ జెండా బుధవారం తిరగబడిందన్నారు. ఇది కేవలం ఒక పార్టీ జెండా తిరుగుబాటు కాదని,మోసపోయిన తెలంగాణ ప్రజల తిరుగుబాటని పేర్కొన్నారు. ములుగు కేంద్రంలో జరిగిన భారీ ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. "100 రోజుల్లో చేస్తామని చెప్పి,1000 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అనేక ఉప హామీలు నేడు కాగితాలకే పరిమితమయ్యాయని వారు ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2500 అన్నారు. ఏ మహిళకు అందుతోందో చెప్పాలని అన్నారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. రైతు భరోసా రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో రూ.15,000 ఇస్తామన్నారని,కానీ వానాకాలం, యాసంగి సీజన్లు గడిచిపోతున్నా రైతు ఖాతాలో పడేది శూన్యమన్నారు.కౌలు రైతులకు భరోసా ఎక్కడ ఉందని అన్నారు.యువతకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారని,నేటికి నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు.నిరుద్యోగ భృతి రూ.4000 ఏమైందని,పేపర్ లీకేజీలతో యువత జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నారు.పాలన చేతకాక కేసీఆర్ పై నిందలు వేసే కాంగ్రెస్ ది దివాలాకోరు రాజకీయమని అన్నారు.మూడేళ్లకు చేరువవుతున్న కాంగ్రెస్ పాలనలో సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క విజయం లేదని పేర్కొన్నారు.ప్రతి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకే ఒక్క ఆయుధం కేసీఆర్ పై నిందలు వేయవటమేనని ఆరోపించారు.కాళేశ్వరం కూలిందని, అప్పులు పెరిగాయని, ఉద్యోగాలు ఇవ్వలేదని అంటూ తెలంగాణను 10 ఏళ్లు అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.ప్రజలు అమాయకులు కారని,కాళేశ్వరం లో భాగమైన సమ్మక్క బ్యారేజ్ వల్లే ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చెరువులు నిండాయని అన్నారు.మిషన్ భగీరథ వల్ల ప్రతి గిరిజన గూడెంలో నల్లా వచ్చిందని తెలిపారు.రైతుబంధు వల్ల రైతు ఆత్మగౌరవంగా బతికాడని,అభివృద్ధిని చూసిన కళ్ళు అబద్ధాలను నమ్మవని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిద్రమత్తులో ఉందని , ఈ తిరుగుబాటు ములుగుకే పరిమితం కాదని అన్నారు.తెలంగాణలోని ప్రతి గడ్డపై, ప్రతి గ్రామంలో ఇదే గులాబీ తిరుగుబాటు తప్పదని తెలిపారు.హామీలతో గెలిచి, మోసంతో పాలించాలని చూస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.ములుగు గడ్డపై ఎగిసిన ఈ గులాబీ జెండా, తెలంగాణ ఆత్మగౌరవ పునరుద్ధరణకు నాంది అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాటు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు1
- మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు మామునూరు, సెప్టెంబర్ 02: మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.2
- తొలగించాడు.. పోలీసుల ముందు నివాళులర్పించాడు! రాజశేఖర్రెడ్డి చిత్రపటం తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం.. పోలీసుల జోక్యంతో వివాదానికి తెర రాజశేఖర్రెడ్డి చిత్రపటం తొలగింపుతో దంతాలపల్లిలో ఉద్రిక్తత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి చిత్రపటాన్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అయితే కొద్దిసేపటికే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆ చిత్రపటాన్ని తొలగించినట్లు కాంగ్రెస్ నాయకుల దృష్టికి వచ్చింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి సదరు వ్యక్తిని తీసుకువచ్చారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకు తొలగించిన చిత్రపటాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయించి, అతని చేతుల మీదుగా రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించించారు. దీంతో కొంతసేపు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి.చిత్రపటం తొలగింపు ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్రపటం తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు సదరు వ్యక్తితోనే నివాళులు అర్పించడంతో కాంగ్రెస్ నాయకులు శాంతించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.4
- తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నరు..ఇది మంచిది కాదు ఈ పిచ్చి పని బంద్ చేయాలి...GO.97 వెంటనే ఉపసంహరించుకోవాలే *_ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్*1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.1
- నర్సంపేట: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ధర్నా........... నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్ రోడ్డు జంక్షన్) వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1