1)కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. 2) వేతనాల పెంపుదల కోసం ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయండి. సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్.. బద్వేలు, జూలై 29:జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయాలని, షెడ్యూల్ ఎంప్లాయిస్ కి వేతనాలు రివైజ్ చేయాలని సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోజుననాలుగు రోడ్ల సెంటర్లో గల సిఐటియు పట్టణ కార్యాలయము నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత, సంఘటిత కార్మికులు జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి ఐదు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆప్కాస్ లో 25 వేల మంది, మున్సిపల్, విద్యుత్, విద్య, వైద్యము స్కీం వర్కర్లు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, వివో ఏలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, టీచింగ్, నాన్ టీచింగ్, ఆసుపత్రులలో శానిటేషన్, నర్సులు, డిక్షన్ కంపెనీలో 2,500 మంది, షిరిడి సాయి లో దాదాపు 7వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కలెక్టర్ నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఆప్కాస్ లేకుండా ఏ శాఖ లేదని పేర్కొన్నారు. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి, పెన్షన్ లేదని తెలిపారు.పంజాబ్ తరహాలో జిల్లాలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, త్రిబుల్ ఐటీ, వై వీ యూ, ఆర్కిటెక్, వెటర్నటి యూనివర్సిటీ, ఏపీ కార్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్ టి, బి సి, మైనార్టీ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, సెక్యూరిటీ,శానిటేషన్, వాచ్మెన్ ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, స్లీపింగ్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాసులు, గంపా సుబ్బరాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
1)కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. 2) వేతనాల పెంపుదల కోసం ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయండి. సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్.. బద్వేలు, జూలై 29:జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన జయప్రదం చేయాలని, షెడ్యూల్ ఎంప్లాయిస్ కి వేతనాలు రివైజ్ చేయాలని సిఐటియు పట్టణ నాయకులు కె.శివకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోజుననాలుగు రోడ్ల సెంటర్లో గల సిఐటియు పట్టణ కార్యాలయము నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత, సంఘటిత కార్మికులు జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి ఐదు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆప్కాస్ లో 25 వేల మంది, మున్సిపల్, విద్యుత్, విద్య, వైద్యము స్కీం వర్కర్లు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, వివో ఏలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, టీచింగ్, నాన్ టీచింగ్, ఆసుపత్రులలో శానిటేషన్, నర్సులు, డిక్షన్ కంపెనీలో 2,500 మంది, షిరిడి సాయి లో దాదాపు 7వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కలెక్టర్ నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఆప్కాస్ లేకుండా ఏ శాఖ లేదని పేర్కొన్నారు. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుటి, పెన్షన్ లేదని తెలిపారు.పంజాబ్ తరహాలో జిల్లాలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, త్రిబుల్ ఐటీ, వై వీ యూ, ఆర్కిటెక్, వెటర్నటి యూనివర్సిటీ, ఏపీ కార్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్ టి, బి సి, మైనార్టీ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, సెక్యూరిటీ,శానిటేషన్, వాచ్మెన్ ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, స్లీపింగ్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాసులు, గంపా సుబ్బరాయుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
- గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ వివరించారు.1
- గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం వైభవం నంద్యాల: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణం కోసం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి, శ్రీచక్రానికి శాకాలతో సహస్రనామార్చనలు, శాక నివేదనం, శాకహారతులు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బి నగర్ మార్కెట్కు చెందిన శ్రీకాంత్ రెడ్డి బృందం, కర్నూలు మార్కెట్కు చెందిన గిరిధర్ బృందం సుమారు 2 వేల కిలోలకుపైగా కూరగాయలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.3
- శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింపు.. ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులు నంద్యాల జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి బుధవారం శ్రీశైలం జలాశయానికి 14,260 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 42.8708 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో జలాశయానికి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1
- అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్1
- ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి గా కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోసిస్తున్న.. మన ధర్మవరం అసెంబ్లీ శాసనసభ్యులు ప్రజా నాయకుడు శ్రీ సత్యకుమార్ అన్నగారికి పోరాటపటిమను మీడియా ముఖంగా ప్రజలకు వివరించిన బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి & బీజేపి SIR రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ( జల్లి మధుసూదన్ గారు)1
- పులివెందుల లో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా పల్లకి ఉత్సవం గురు పౌర్ణమి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.మహిళలు సాయిబాబా పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే ఆలయంలో తాళాల భజనలు అందర్నీ ఆకట్టుకుంది. సాయిబాబా పల్లకి ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అలరించింది.1
- గురుపౌర్ణమి సందర్భంగా కొబ్బరి బొండం పై సాయినాథుని చిత్రం గురుపౌర్ణమి పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన కళారూపం అందరినీ ఆకట్టుకుంటోంది. వెలుగోడుకు చెందిన కళాకారుడు కళ్యాణ్ కొబ్బరి బొండం పై సాయినాథుని దివ్య చిత్రాన్ని వేసి భక్తిని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి 6 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రంలో సాయినాథుని దివ్యమైన ముఖారవిందంతో పాటు, ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రం రూపంలో వివరించినట్లు తెలిపారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం... ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు) బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....1
- ఆత్మకూరులో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు ఆత్మకూరు పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ నుండి ఆత్మకూరుకు కూరగాయల లోడు తో వచ్చిన ఐచర్ వాహనం నంద్యాల టర్నింగ్లో ఓ కుక్కను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.1