logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం... ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు) బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....

2 hrs ago
user_Pv sivakumar
Pv sivakumar
Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం... ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు) బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం... ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు) బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....
    1
    శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం...


ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు
ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) 
రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు)
బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు 
మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు
మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....
    user_Pv sivakumar
    Pv sivakumar
    Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
    1
    సమాజంలో అవినీతి పెరిగిపోయింది:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద
సమాజంలో అవినీతి పెరిగిపోయిందని.. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల రెడ్డి పిలుపునిచ్చారు. కొంతమంది అధికారులు లంచాన్ని హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే ఏపని చేయడం లేదు. నూటికి 95 మంది లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ అధికారులు ఎక్కడ.. ఈ లంచాలు కనబడటం లేదా.. ఏసీబీ కూడా లంచాలకు
అలవాటు పడింది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి -అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ... ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి
-అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం
పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి  ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. 
జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ...
ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత
అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి.
ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు
సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* 
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. 
ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    1
    అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ముళ్ల పొదలతో మూసుకుపోయిన పొలాల బాట.. 100 ఎకరాల రైతుల ఆవేదన – వెంటనే రహదారి పునరుద్ధరణకు విజ్ఞప్తి వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ మీదుగా సుమారు 100 ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన వ్యవసాయ రహదారి దట్టమైన ముళ్ల పొదలతో పూర్తిగా మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లడం రైతులకు భారంగా మారింది.నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ వరకు రహదారి సక్రమంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా ముళ్ల కంపలతో ఆక్రమించబడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పక్క పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పొలాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బస్తాలను భుజాలపై మోసుకుంటూ మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాల్లోకి వెళ్లలేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం ధాన్యాన్ని తరలించడమూ కష్టసాధ్యంగా మారిందన్నారు.ఈ రహదారిలోని ముళ్ల పొదలను తొలగించి దారిని పునరుద్ధరిస్తే నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సామగ్రి రవాణా సులభతరం కావడంతో పాటు పంటను నేరుగా పొలాల నుంచి ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఉపాధి హామీ పథకం లేదా పంచాయతీ నిధుల ద్వారా ముళ్ల పొదలను తొలగించి వ్యవసాయ రహదారిని పునరుద్ధరించాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
    1
    ముళ్ల పొదలతో మూసుకుపోయిన పొలాల బాట.. 100 ఎకరాల రైతుల ఆవేదన – వెంటనే రహదారి పునరుద్ధరణకు విజ్ఞప్తి
వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ మీదుగా సుమారు 100 ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన వ్యవసాయ రహదారి దట్టమైన ముళ్ల పొదలతో పూర్తిగా మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లడం రైతులకు భారంగా మారింది.నందిపల్లె చెక్‌పోస్ట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కాలనీ వరకు రహదారి సక్రమంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా ముళ్ల కంపలతో ఆక్రమించబడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పక్క పొలాల గట్ల మీదుగా నడుచుకుంటూ పొలాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బస్తాలను భుజాలపై మోసుకుంటూ మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాల్లోకి వెళ్లలేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. పంట కోత అనంతరం ధాన్యాన్ని తరలించడమూ కష్టసాధ్యంగా మారిందన్నారు.ఈ రహదారిలోని ముళ్ల పొదలను తొలగించి దారిని పునరుద్ధరిస్తే నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సామగ్రి రవాణా సులభతరం కావడంతో పాటు పంటను నేరుగా పొలాల నుంచి ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఉపాధి హామీ పథకం లేదా పంచాయతీ నిధుల ద్వారా ముళ్ల పొదలను తొలగించి వ్యవసాయ రహదారిని పునరుద్ధరించాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ బోయకొండ చైర్మన్లు ఎస్కే వెంకటరమణారెడ్డి రతీదేవి దంపతులు అన్నమయ్య జిల్లా పుంగనూరు గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగ్గిడి గోపాల్, సోమల సురేష్, రామనాథం నాయుడు, నందకుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    4
    గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ బోయకొండ చైర్మన్లు ఎస్కే వెంకటరమణారెడ్డి రతీదేవి దంపతులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు  
గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి.
దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగ్గిడి గోపాల్, సోమల సురేష్, రామనాథం నాయుడు, నందకుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    7 hrs ago
  • రాయదుర్గంలో బెస్త కులస్తులు ఆధ్వర్యంలో ఘనంగా వేద మహర్షి జయంతి వేడుకలు రాయదుర్గం పట్టణంలో బుధవారం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వేద మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 400 మంది బెస్త కులస్తులు నడుమ ఊరేగింపు చేపట్టారు.సీతారాముల కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయనకు బెస్త సేవా సంఘం నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ బెస్త సమాజం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెస్త కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ వేద మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఐక్యత, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
    1
    రాయదుర్గంలో బెస్త కులస్తులు ఆధ్వర్యంలో ఘనంగా వేద మహర్షి జయంతి వేడుకలు
రాయదుర్గం పట్టణంలో బుధవారం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వేద మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 400 మంది బెస్త కులస్తులు నడుమ ఊరేగింపు చేపట్టారు.సీతారాముల కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయనకు బెస్త సేవా సంఘం నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ బెస్త సమాజం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెస్త కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ వేద మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఐక్యత, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ వివరించారు.
    1
    గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల
జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని
ఈఈ వివరించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.