Shuru
Apke Nagar Ki App…
कांग्रेस पार्टी 244 (A) लेकर आई थी, क्योंकि हमारी सोच है कि असम को न गुवाहाटी से चलाया जाए और न दिल्ली से। 244 (A) से असम की जनता को ताकत मिलती है और ये उन्हें फैसले लेने की शक्ति देता है। कांग्रेस और BJP में यही फर्क है। : नेता विपक्ष श्री
M.RAJKIRAN REDDY
कांग्रेस पार्टी 244 (A) लेकर आई थी, क्योंकि हमारी सोच है कि असम को न गुवाहाटी से चलाया जाए और न दिल्ली से। 244 (A) से असम की जनता को ताकत मिलती है और ये उन्हें फैसले लेने की शक्ति देता है। कांग्रेस और BJP में यही फर्क है। : नेता विपक्ष श्री
More news from Telangana and nearby areas
- 244 (A) से असम की जनता को ताकत मिलती है और ये उन्हें फैसले लेने की शक्ति देता है। कांग्रेस और BJP में यही फर्क है। : नेता विपक्ष श्री2
- ఆదిలాబాద్ జిల్లా : తలమడుగు మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా కోసాయి గ్రామంలో గల ప్రసిద్ధి గాంచిన హనుమాన్ ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రతిఏటా నిర్వహించే కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని కబడ్డీ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రావణుడు సీత ను ఎత్తుకొని వెళ్ళినప్పుడు రాముని కోసం లంకను అగ్గి పెట్టిన హనుమంతుని కథను ఎమ్మెల్యే గుర్తుచేశారు. హనుమంతుని ధైర్యం మనతో ఉంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- అగ్ని ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండలం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో షాట్ సర్క్యూట్స్ తో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గడ్డివాముల వద్ద తాగిన సిగరెట్లు పారి వేయడం, తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈవో రాహుల్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- Post by Solanke Ravi2
- సినిమా ల్లో చాన్స్ కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన ఘటన బంజా రాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరి గింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సినిమా రంగంపై ఆసక్తి కలిగిన సంజయ్ హీరోలు చెప్పే డైలాగ్స్ చెబుతూ, పాట లు పాడుతూ ఎప్పటికైనా తాను సిని మాల్లో నటిస్తానంటూ చెప్పేవాడు. కాగా విద్యానగర్ లో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చినప్పుడల్లా ఫిలింనగర్ తో పాటు ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో అవకాశాల కోసం తిరిగేవాడు. ఈ క్ర మంలో గతనెల 14న అనకాపల్లి నుంచి నగరానికి వచ్చిన సంజయ్ బుధవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీకి వెళ్లాడు. అక్కడ నేత క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కార్యాల యానికి ఉదయం పదిన్నరకు వెళ్లాడు. ఆఫీసులోకి వెళ్లి వాకబు చేయగా ఆడి షన్స్ గతంలోనే జరిగాయని, ప్రస్తుతం ఏవరినీ తీసుకోవడం లేదని సిబ్బంది చెప్పారు. అక్కడే కుర్చీలో కూర్చున్న సంజయ్ కాసేపటికే కుర్చీలోనే పక్కకు ఒరిగి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నా రు. సినిమా చాన్స్ కోసం అంటూ ఎన్నో ఏళ్లుగా తపిస్తున్న సంజయ్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లప ర్యంతం అయ్యారు.1
- నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సోన్ పెట్ గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థులు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఉదయం నుండే అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం హోమాలు ఇతర విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి గ్రామ కమిటీని అభినందించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం శుభపరిణామమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు సోన్ పెట్ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై హనుమాన్ నినాదాలతో సోన్ పెట్ గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్తజనులు బీ.ఆర్.ఎస్. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- 🌿🌿🌿🌿🌿 .* *ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ. గోడం నగేష్ గారు లోకసభలో మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటవిశాఖ అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరడం జరిగింది. జిల్లాలోని ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ మరియు PMGSY ద్వారా మంజూరైన రోడ్లకు వాటి అనుమతులు లేక పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గారు కోరారు.* 🌿🌺🌿🌺🌿🌺🌿1