Shuru
Apke Nagar Ki App…
వరంగల్లో బీహార్ రాష్ట్రానికి చెందినయువకుడి దారుణ హత్య వరంగల్ నగరంలోని శంభునిపేట బుడగ జంగాల కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్కు చెందిన యువకుడు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తుండగా, ఇద్దరి మధ్య జరిగిన గొడవలు హత్యకు దారితీసినట్లు సమాచారం. మరో వ్యక్తి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. మిల్స్ కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
M D Azizuddin
వరంగల్లో బీహార్ రాష్ట్రానికి చెందినయువకుడి దారుణ హత్య వరంగల్ నగరంలోని శంభునిపేట బుడగ జంగాల కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్కు చెందిన యువకుడు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తుండగా, ఇద్దరి మధ్య జరిగిన గొడవలు హత్యకు దారితీసినట్లు సమాచారం. మరో వ్యక్తి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. మిల్స్ కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ నగరంలోని శంభునిపేట బుడగ జంగాల కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్కు చెందిన యువకుడు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తుండగా, ఇద్దరి మధ్య జరిగిన గొడవలు హత్యకు దారితీసినట్లు సమాచారం. మరో వ్యక్తి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. మిల్స్ కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.1
- ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు1
- Devi5
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.1