_కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఫైర్ నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.
_కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఫైర్ నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.1
- ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు1
- Hyderabad Traffic Police #HyderabadTrafficPolice #CPRAwareness #SaveLives #RoadSafety #HyderabadNews #TrafficAwareness #HumanityFirst #EmergencyCare #HeartAttackHelp #PublicSafety #HyderabadPolice #LifeSavingSkills #CPRTraining #SafetyFirst #IndiaNews1
- వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.1
- ఎక్స్సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.1
- జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది1
- నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి.. *బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు... పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం... అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు సమాచారం... నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.? నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు... నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్... "రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు... ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్... సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️1
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.1
- ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.1