Shuru
Apke Nagar Ki App…
ఉప్పరిగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీరియల్ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా లో రోడ్డు ప్రమాదం. మహిళ మృతి. మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం, ఉప్పరగూడెం వద్ద జాతీయ రహదారి 365/A పై టిప్పర్ ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన నాగటి పద్మం ( 50) అనే మహిళను అక్కడికక్కడే మృతి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు సీరోలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన..
Mogulagani Mahendar Mogulagani Mahendar
ఉప్పరిగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీరియల్ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా లో రోడ్డు ప్రమాదం. మహిళ మృతి. మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం, ఉప్పరగూడెం వద్ద జాతీయ రహదారి 365/A పై టిప్పర్ ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన నాగటి పద్మం ( 50) అనే మహిళను అక్కడికక్కడే మృతి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు సీరోలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన..
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- ఉగాది శుభకాంక్ష లు2
- ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.1
- కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎంను, ఎంఐఎం ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జాతిపితను అవమానపరిచేలా వ్యవహరిస్తూ గాడ్సేకు వారసులుగా బీజేపీ నాయకులున్నారని విమర్శించారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాతపూర్వకంగా లేదా తమ పార్టీ సభ్యుల ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతి వనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీ నీ స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజుల్లోనే తుపాకి పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళని ఆరోపించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని, అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య వైద్యం వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణ లే నిదర్శనమని తెలిపారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విమర్శించారు. సబర్మతి డెవలప్ చేసుకోగా.. మూసి డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూసినిర్వాసులకు న్యాయం చేసిన తరువాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్ఎస్ లు సహకరించాలని కోరారు.2
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- Post by వేముల నాగరాజు1
- హనుమకొండ, మార్చి 18: మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హసన్పర్తి సంస్కృతి విహార్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆమె ప్రారంభించారు. కాకతీయ మహిళా సమాఖ్య ద్వారా లక్షకు పైగా సభ్యులు రూ.460 కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు పొందడం అభినందనీయమని తెలిపారు. బస్సుల కొనుగోలు, ధాన్యం వ్యాపారం, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. సంఘాల ద్వారా ప్రతి నెల ఆదాయం పెరుగుతోందని, మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అవలంబించి ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు.1