Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ శాఖలో ఆటిజన్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. వారి నిరసన కార్యక్రమంలో కొత్తగూడెంలో ఉన్న జాగృతి నాయకులు పాల్గొంటారు. ఆటిజన్ల పోరాటానికి జాగృతి మద్దతు తెలుపుతోంది. గత ప్రభుత్వంలో ఆటిజన్ల జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేశా. వారికి నెలకు 40 వేల రూపాయల జీతం వస్తుందంటే అందులో జాగృతి పాత్ర ఉంది.
Vishwamber Rao
విద్యుత్ శాఖలో ఆటిజన్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. వారి నిరసన కార్యక్రమంలో కొత్తగూడెంలో ఉన్న జాగృతి నాయకులు పాల్గొంటారు. ఆటిజన్ల పోరాటానికి జాగృతి మద్దతు తెలుపుతోంది. గత ప్రభుత్వంలో ఆటిజన్ల జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేశా. వారికి నెలకు 40 వేల రూపాయల జీతం వస్తుందంటే అందులో జాగృతి పాత్ర ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- Post by Vishwamber Rao1
- *మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కు స్వాగతం* సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తాడిత పిడిత అనగారిన ప్రజల పక్షాన అజ్ఞాతంలో ఉద్యమించిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగిపోయిన అనంతరం మొదటి సారి తన జన్మస్థలమైన కోరుట్ల పట్టణం తిరిగి వచ్చిన సందర్భంగా తన తమ్ముడి నివాసంలో వున్న దేవ్ జీ ని కోరుట్ల పట్టణ మైనార్టీ నాయకులు జాతీయ చిరు వ్యాపారుల సంఘం కోరుట్ల పట్టణ అధ్యక్షులు షాహద్ మొహమ్మద్ షేక్,మోయిజ్ రహ్మాన్. జర్నలిస్ట్ అబ్దుల్ ముసవ్విర్ . యునుస్ లు కలిసి శాలువాతో సన్మానించారు.1
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.1
- కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం4
- సంగారెడ్డిలో ఉత్సాహంగా యూటీఎఫ్ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.1
- మెట్ పల్లి, ఏప్రిల్ 11 : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బిచ్చల అంకిత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని గుర్తించిన స్థానికులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రిని కోల్పోయి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అంకితకు ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచారు.ఈ సందర్భంగా శనివారం సుమారు 120 మందికి సరిపడా బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందజేయడంతో పాటు పెళ్లి కూతురికి పట్టు చీరను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, సభ్యులు శ్రీగద్దె రత్నాకర్, తారి రాజశేఖర్, చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ట్రస్ట్ సేవలను అభినందించారు.3
- ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1