Shuru
Apke Nagar Ki App…
ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
More news from తెలంగాణ and nearby areas
- సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.1
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు.1
- "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు1
- 👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది. ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది. ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది. అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది. ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది. దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు. తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు. అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం. అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు. మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.4
- డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝1
- బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.1
- జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ అభ్యర్థులను సర్వే ఆధారంగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకుల ప్రమేయం లేదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో రేపు సీఎం పర్యట నేపథ్యంలో చొప్పదండి కరీంనగర్ లో పర్యటించిన మంత్రి తుమ్మల కరీంనగర్ లో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయంపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి తుమ్మల తో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం నాయిని రాజేందర్ రెడ్డి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియోజకవర్గం నగర అధ్యక్షులు అంజన్ కుమార్ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పైరవీలకు తావు లేకుండా ప్రజా మద్దతు గల వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మనోభావాలకు తగ్గట్లుగా అభ్యర్థులు ఎంపిక చేశామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ విజయం ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి పార్టీకి గొప్ప గుర్తింపు తీసుకువచ్చే విజయం అన్నారు. నాణ్యత గల నాయకులను ఈ రాష్ట్రానికి అందించిన జిల్లా కరీంనగర్ అని అలాంటి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని చైర్మన్ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని సూచించారు. అన్ని పార్టీలకంటే ప్రచారంలో మనం ముందు ఉండాలని, అభ్యర్థులు పట్టుదలతో గెలవాలనే లక్ష్యసాధన ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం టికెట్లు దక్కని వారికి జిల్లా పరిషత్, సుడా, సింగిల్ విండో, గ్రంథాలయం ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రతి ఓటర్ ను కలవాలని రేపటి ముఖ్యమంత్రి సభ విజయవంతమే మీ విజయానికి పునాది అవుతుందని తెలిపారు. సీఎం సభకు ప్రతి డివిజన్ నుండి 500 మంది కార్యకర్తలను తరలించాలని సూచించారు.1
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.1