logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ భీమేశ్వర ఆలయంలో పూజలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

18 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
18 hrs ago

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ భీమేశ్వర ఆలయంలో పూజలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. 
రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ  మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.
    1
    సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, రాజకీయ వాతావరణం మాత్రం తారాస్థాయిలో వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఇంటింటి ప్రచారం సిద్దిపేట పట్టణాన్ని పూర్తిగా రాజకీయ రంగస్థలంగా మార్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలతో, విమర్శలతో ప్రజల ముందుకు వెళ్లిన ఇరు పార్టీలు ప్రచారాన్ని మరింత ఉగ్రంగా సాగిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ “కాంగ్రెస్ బాకీ కార్డు” పేరుతో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తుండగా, దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు “బీఆర్ఎస్ డోకా కార్డు”ను చేతుల్లోకి తీసుకుని ఎదురుదాడికి దిగారు. ఈ రెండు ప్రచారాలు ఒకే సమయంలో సాగడంతో సిద్దిపేటలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ ప్రచారం సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వీధిలో ఒకేసారి ఇంటింటి ప్రచారానికి దిగడంతో ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో పరస్పర నినాదాలు, ఆరోపణలు, ప్రతిఆరోపణలు హోరెత్తాయి. మాటల తూటాలు మరింత వేగం పుంజుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్తతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ఎత్తున జరిగే అవాంఛనీయ ఘటనలు తప్పినట్లు అయింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆ విషయాలను ప్రజలకు తెలియజేయడానికే “బాకీ కార్డులు” పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇప్పటికే ఇంటింటి ప్రచారమే రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో, రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకపోయినా సిద్దిపేట రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్ కరెంట్‌లా మారుతున్నాయి.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    19 hrs ago
  • బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
    1
    బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 min ago
  • "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    1
    "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    17 hrs ago
  • 👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని  తీవ్ర ఆవేదనలోకి నెట్టింది.  వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది. ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది. ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది.  అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది  అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది. ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది.  దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు  పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు.  అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు.  తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు.  అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది.  మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి.  ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం. అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు.  మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.
    4
    👉 కాంగ్రెస్ అధిష్టానం తన మెడ కోసినట్లుయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నువ్వా - నేనా అన్నట్టుగా నడుస్తున్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థులకు బి -ఫారం పంపిణీకి సంబంధించి, జీవన్ రెడ్డిని  తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. 
వివరాల్లోకి వెళితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎప్పటిలాగే తన పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గండి కొట్టింది.
ఎందుకంటే జగిత్యాల మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు 1984 నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2000 సంవత్సరంలో నేరుగా చైర్మన్ గా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మారు కైవసం చేసుకున్నప్పటికీ, పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉండి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది.
ఆ ఒరవడికి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఎలాగైనా నిలువరించాలన్న లక్ష్యంతో, brs ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనే బాణంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ లో అలజడి రేపుతుంది.
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల శాసనసభ్యునిగా డా సంజయ్ కుమార్ రెండవ మారు గెలుపొందడం తెలిసిందే. రెండవ మారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం దృష్ట్యా, ఆరు నెలల వరకు కూడా తమ బిల్లులు రావడంలేదని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చురేపినట్లు అయింది.
ఎందుకంటే గత కొద్దిరోజుల నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జెండా మోసిన కార్యకర్తలకే కౌన్సిలర్ టికెట్లని ప్రకటిస్తూ, 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను విస్మరించేది లేదని వారిని కాపాడుకోవడం తన బాధ్యత అని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చివరి క్షణం వరకు, పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేచి చూస్తూనే ఉన్నారు.
జగిత్యాల మున్సిపల్ లో ఉన్న 50 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్టును పార్టీ అధిష్టానానికి పంపించారు.
అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంపిన లిస్టు పక్కన పెట్టి ఆ లిస్టు నుండి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి మరో 30 మందిని డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించిన పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేయడం మంగళవారం తీవ్ర అలజడి రేపింది. 
అయితే సోమవారం మధ్యాహ్నం తమకు టిక్కెట్ దక్కడం లేదన్న అనుమానంతో బొల్లి శేఖర్ అనే ఒక కార్యకర్త 16వ వార్డులో నామినేషన్ వేసిన తనకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి నివాసం ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైతం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది 
అయినప్పటికీ కూడా చివరి రోజు మంగళవారం బి ఫారం లను ఆయా అభ్యర్థులకు అందజేయడానికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేతికి పార్టీ అధిష్టానం ప్రతిపాదించిన లిస్టును పంపించింది.
ఉదయం కల్లా ఆ లిస్టు బయటకు రావడం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాను అని అంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు మాత్రమే రావడం కలకలం రేపింది. 
దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని తమ ఆవేదనను వెళ్ళగకుతున్నారు 
పార్టీ జెండా మోయని నాయకుడు, అలాగే గత పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ నాయకుడిగా తమపై ఆధిపత్యం చెలాయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసైగల్లో నడుస్తూ సీనియర్లైన జీవన్ రెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టడం, ఇది దేనికి నిదర్శనం అని అంటున్నారు. 
అంతేకాకుండా ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తమవల్ల కావడంలేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ సందర్భంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేస్తూ నాలుగు దశాబ్దాలు తన రాజకీయ జీవితం ముగింపు దశలో పార్టీ అధిష్టానం ఈ విధంగా వ్యవహరించడం "తన మెడకోసినట్లయిందని" ఆవేదన వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ పేరుతో తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి చూస్తూ ఊరుకోమంటే తన వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా తనొక్కడి కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే తను పట్టించుకోకుండా ఉండడం, చూస్తూ ఊరుకోలేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పార్టీ కష్టకాలంలో ప్రవాహానికి ఎదురొడ్డి, పార్టీ జెండా మోసి జగిత్యాల నియోజకవర్గం లో కాంగ్రెస్ ను కాపాడుకున్న తమను ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో పక్కకు నెట్టేసినట్లే అవుతుందని అంటున్నారు. 
తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండిపోయింది అని, ప్రజలకు ఎన్నడు దూరంగా లేనని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే నాకు ప్రాణం అని అన్నారు. 
అంతేకాకుండా తనకు ఏ వర్గం అంటూ లేదని, కేవలం కార్యకర్తలే నా వర్గం అని, వారే తన నాయకులని స్పష్టం చేస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మీడియాతో చిట్ చాట్ లో నవ్వుతూ మాట్లాడుతుండడం కనిపించింది. 
మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బి ఫారంల నిర్ణయం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో ఏ విధమైన అలజడిని సృష్టిస్తుందో వేచి చూడాలి. 
ఇదిలా ఉండగా, డా. సంజయ్ కుమార్ ఏ విధమైన టెన్షన్ లేకుండా తన అనుచరులను కాపాడుకునే రీతిలో పార్టీ అధిష్టానం వద్దకు దాదాపు ప్రతిరోజు వెళ్లినట్టే వెళుతూ, 50 వార్డులకు గాను 30 వార్డుల టికెట్లు పొందడం గమనార్హం.
అయితే జీవన్ రెడ్డికి కేటాయించిన 20 టికెట్లకు పోను, డా. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 సీట్లలో 20 మందికి పైగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారు అన్న అభిప్రాయాన్ని జీవన్ రెడ్డితో పాటు నాయకులు ఈ సందర్భంగా అంటున్నారు. 
మొత్తానికి జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో అగ్గి రాజుకుందని మంగళవారం నాటి కార్యకర్తల అభిప్రాయాలు, వారి ఆవేదనలు, ఆక్రోషం, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం లాంటి ఘటనలు చెబుతున్నాయి.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు  కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు  సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో  1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్  అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్  రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.