Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి భార్య తన భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్నంలోని గోసంగి కాలనీలో ఉంటున్న కోదండ శివ రాత్రి సమయంలో భోజనం చేస్తుండగా అతని భార్య కోదండ లక్ష్మి గొడవపడి అక్కడ ఉన్న కొడవలితో దారుణం హత్య చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శివ భార్య లక్ష్మిను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులను పోలీసులు సంఘటన వివరాలు తెలుసు కున్నారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మృతునికి పిల్లలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పారు.
Narmala Swapna
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి భార్య తన భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్నంలోని గోసంగి కాలనీలో ఉంటున్న కోదండ శివ రాత్రి సమయంలో భోజనం చేస్తుండగా అతని భార్య కోదండ లక్ష్మి గొడవపడి అక్కడ ఉన్న కొడవలితో దారుణం హత్య చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శివ భార్య లక్ష్మిను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులను పోలీసులు సంఘటన వివరాలు తెలుసు కున్నారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మృతునికి పిల్లలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం 'ప్రజావాణి' నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 143 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.1
- ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- వెల్దుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.1
- Post by Vishwamber Rao1
- మెదక్ జిల్లా మాసాయిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పూర్తి వివరాలు కెళ్తే మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామచావిడి వద్ద బిఆర్ఎస్ జెండా దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరగా ప్రధాన కూడలి వద్ద బిఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ చేసిన సేవలను కొనియాడుతూ మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. అలాగే చిట్టిమిల్ల నాగరాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి ఇప్పుడు కూడా ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారని ఈ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏం లేదని ఏదో చేశారు.1
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమంది తమ పనిని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.వడ్డెర కులానికి చెందిన సుమారు 30 కుటుంబాలు గత 70 ఏళ్లుగా కోమడిబండ అటవీ ప్రాంతంలో అడవిలో లభించే పండ్లు, పలాలతో పాటు గుట్టలపై ఉన్న బండరాళ్లను కొట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే మిషన్ భగీరథ పథకం కింద గుట్టపై వాటర్ ట్యాంక్ నిర్మాణం సమయంలో అధికారులు తమను అక్కడి నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్న సమయంలో, గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమి తమదేనని, గుట్టపై ఉన్న బండరాళ్లు కూడా తమవేనని చెబుతూ తమ ఉపాధిని అడ్డు కుంటున్నారని వడ్డెర కులస్తులు వాపోయారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, జీవనాధారంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం బండరాళ్లు కొట్టి జీవిస్తున్న తమకు తక్షణమే న్యాయం చేసి జీవనోపాధి కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. లేకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వడ్డెర కులస్తులు హెచ్చరించారు.4
- తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు M.0. డా. ఆస్మా తెలిపారు. జిల్లా మానసిక ఆరోగ్యాధికారి మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల అందజేశారు. అనంతరం ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగంపై, సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాలు నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.1