Shuru
Apke Nagar Ki App…
SS NEWS
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి రామభక్తుల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.1
- విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలో గ్యాస్ డెలివరీ వ్యవస్థలో తీవ్ర అవ్యవస్థ బయటపడింది. చిన్న గంట్యాడలో ఉన్న మణికంఠ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినియోగదారుల వద్ద నుంచి ఓటీపీ తీసుకున్న గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్లు అందించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ జరిగినట్లు మొబైల్కు మెసేజ్లు వచ్చినప్పటికీ, వాస్తవంగా గ్యాస్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీని సంప్రదించిన వినియోగదారులకు, వారం రోజుల క్రితమే గ్యాస్ డెలివరీ చేసినట్లు ఏజెన్సీ సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో బాధితులు నెల రోజులుగా ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్యాస్ డెలివరీ బాయ్ అప్పారావు సుమారు 30 సిలిండర్లతో పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మణికంఠ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముందస్తుగా ఏజెన్సీ స్పందించి ఉంటే ఇంత పెద్ద సమస్యగా మారేది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.4
- Post by Shyam1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..! విద్యార్థుల భద్రతతో ఆటలాడుతున్న ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు, కాలేజీ యాజమాన్యానికి మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిసే వరకు అందరూ తప్పకుండా షేర్ చేయండి.1
- దేవీపట్నం, శనివారం: మండలంలోని పోతవరం గ్రామ సమీపంలో పులి సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో పరిశీలనలు చేపట్టారు. ఈ సందర్భంగా మత్తు ఇంజక్షన్ అందించే నిపుణుల బృందాన్ని కూడా వెంట తీసుకువెళ్లారు. డ్రోన్ ద్వారా అనుమానిత ప్రాంతాలను పరిశీలిస్తూ పులి జాడను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1
- Post by Syyed taher1
- పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి మహిళను,ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు.వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది.తక్షణమే స్పందించి తల్లీ,కొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్,డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.4
- ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు తెలంగాణ హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దడానికి ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన, పాడైన గుడ్లను వాడుతున్నట్లు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత పాటించకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు.1