సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
- సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.1
- రామగుండం కార్మికుల హక్కులు – స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎన్టీపీసీ ఛైర్మన్తో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కీలక భేటీ* *రామగుండం కార్మికుల హక్కులు – స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎన్టీపీసీ ఛైర్మన్తో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కీలక భేటీ* *న్యూఢిల్లీ:* రామగుండం ప్రాంత కార్మికుల సమస్యల పరిష్కారం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు *గడ్డం వంశీ కృష్ణ* గారు ఎన్టీపీసీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ *Gurdeep Singh* గారిని కలిసి పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు *గ్రేడ్-బి రేటింగ్* కల్పించి న్యాయమైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు అవసరమైన *మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని* విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు ఫిట్నెస్ సర్టిఫికేట్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న *800×3 మెగావాట్ల సూపర్ థర్మల్ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యం కల్పించి భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని* ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని గట్టిగా కోరారు.1
- శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.1
- యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేట్ లో అవకాశం కల్పిస్తాం యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్. యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలో చేపట్టే నామినేట్ పోస్టుల్లో అవకాశం కప్పిస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జిల్లా రివ్యూ మీటింగ్ అధ్యక్షులు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోషిణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞ, థామస్ మరియు కరీంనగర్ జిల్లా ఇంచార్జి తేజస్విని, జోసెఫ్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు, అసెంబ్లీ అధ్యక్షులు అట్లా అనిల్, కృప సాగర్, నగర అధ్యక్షులు విశాల్, వివిధ కమిటీ బాధ్యులు ఫహద్ ,తల్లపెల్లి శ్రీకాంత్, తోర్తి అరవింద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్, తదితరులు పాల్గొన్నారు1
- తల్లిపాలు చిన్నారులకు సంపూర్ణ ఆహారం: ఎంపీడీవో మధుసూదన్ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. తల్లిపాలు చిన్నారులలో రోగ నిరోధక శక్తిని పెంచి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, RBSK డాక్టర్ శోభారాణి, ఫార్మసిస్ట్ అజయ్ కుమార్, Anm సుజాత, నాగ ప్రమీల ,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, శంకరమ్మ, ఆశా రాజేశ్వరి, లలిత, రాజమణి, ఆయా, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.1
- ఛైర్మన్తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్గ్రేడ్, మెడికల్ ఫిట్నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.1
- ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు జలకళ... మత్తడి దూకే అవకాశం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. భారీగా వచ్చి చేరుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే నర్మాల ప్రాజెక్టును సందర్శించిన మానేర్ జలకళను పరిశీలించారు. నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రెండు టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు లో ప్రస్తుతం 1.7 టిఎంసీలకు నీరు చేరింది. కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. ఇదే స్థాయిలో వరద వస్తే గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.1
- జల్సాలకు గంజాయి విక్రయాలు., విఠల్ నగర్ లో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు విట్టల్ నగర్ సెంటర్ దగ్గర గల వాటర్ ట్యాంక్ వద్ద ఒక వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్సై అనూష మరియు తన సిబ్బందితో వెళ్లి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని అతని వద్ద 250 grms డ్రై గంజాను పట్టుకొని పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకున్నారు పట్టుబడిన వ్యక్తి తన స్నేహితులైన మరో ముగ్గురు వ్యక్తులతో జల్సాలకు మరియు మధ్యానికి బానిసలై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గోదావరిఖని నుండి చంద్రాపూర్ మహారాష్ట్ర ఏరియాకు రైలులో ప్రయాణం చేసి అక్కడ రైల్వే స్టేషన్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి గోదావరిఖనిలో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తున్నామని సదరు వ్యక్తి తెలియజేసినాడు ఎస్సై అనూష పంచరామ నిర్వహించి అట్టి వ్యక్తి నుంచి ఒక సెల్ ఫోన్ మరియు 250 గ్రాముల గంజాను స్వాధీనపరచుకొని ఫిర్యాదు చేయగా సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు1