Shuru
Apke Nagar Ki App…
బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి: సిరి సహస్ర నివాళి విజయనగరం ఇందిరానగర్ (34వ డివిజన్) కార్పొరేటర్ బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కుమారుడు బాలి ప్రతాప్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరి సహస్ర పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరి సహస్ర, పైడిరాజు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.బాలి పైడిరాజు కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎలాంటి అవసరమున్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Giridhar singh
బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి: సిరి సహస్ర నివాళి విజయనగరం ఇందిరానగర్ (34వ డివిజన్) కార్పొరేటర్ బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కుమారుడు బాలి ప్రతాప్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరి సహస్ర పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరి సహస్ర, పైడిరాజు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.బాలి పైడిరాజు కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎలాంటి అవసరమున్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగుడ మండలంలోని టుడుంగుడ, బడిమెల, పరిడి, లైగండ, గుంటసీమ, గుంటగన్నేల, అర్మ తదితర గ్రామాల్లో వేసవి వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతు కూలీలు నాట్లు వేయడంలో బిజీగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన వర్షాలతో పొలాల్లో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయంటున్నారు. సుమారు 100 ఎకరాల్లో వేసవి వరి నాట్లను వేస్తున్నట్లు ఆయా గ్రామాల గిరి రైతులు తెలిపారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి నీటిలో సగానికి పైగా మునిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు పనుల నిమిత్తం గేట్లు మూసివేయడంతో బ్యాక్ వాటర్ భారీగా వచ్చి చేరింది. దీంతో మంగళవారం ఉదయానికి ఆలయం నీట మునిగిపోయిందని, భక్తులు గమనించాలని ఆలయ ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాల్లో చిన్నారులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ఆడి భక్తులను ఆకట్టుకున్నారు. శివనామస్మరణతో మారుమోగుతున్న వాతావరణంలో రంగురంగుల కర్రలతో లయబద్ధంగా నృత్యం చేసిన చిన్నారుల ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ కోలాటం శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు చిన్నారులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17. మాఘ బౌల అమావాస్య మంగళవారం నాడు ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు ఆలయంలో భక్తులు మంగళవారం నాడు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు ఈ పూజలో భాగంగా స్వామికి అభిషేకాలు పంచామృతాభిషేకాలు తమలపాకుల పూజ సింధూర పూజ నిమ్మకాయలతో దండలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అప్పాలు నేతి గార్లు దండలు వేసి మొక్కులు ముడుపులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.1
- 🙏😭1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సగానికి పైగా నీట మునిగింది. మంగళవారం ఉదయానికి దేవీపట్నం మండలంలో ఉన్న గండి పోచమ్మ తల్లి ఆలయం సగానికి పైగా గోదావరి నీటిలో మునిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు చేస్తున్న కారణంగా గేట్లు మూసివేశారని, దీంతో బ్యాక్ వాటర్ వచ్చి ఆలయం మునిగిపోతోందని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు.1
- హుకుంపేటలో వెలుగు కార్యాలయ స్థలాన్ని (26 సెంట్లు) ఆక్రమించి, 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ ఆదేశాలతో ఆక్రమణలు తొలగించి, భూమిని వెలుగు సిబ్బందికి అప్పగించారు. ఏజెన్సీలో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన వాహన తనిఖీలలో ఈరోజు (16-02-2026) భూదారాళ్ళ గ్రామ శివారు వద్ద గంజాయి పట్టుబడింది. నలుపు రంగు స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపగా వారు వెనక్కి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సంచిలో 2.215 కిలోల గంజాయి బయటపడింది. పట్టుబడిన వారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన జగరపు సాయికుమార్ (20), పులిగ విజయరాజ్ (19)గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని ధారకొండ అవతల ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి స్వీయ వినియోగం కోసం అనపర్తికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. గంజాయి, రవాణాకు ఉపయోగించిన స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డిపిఎస్ చట్టం 8(c) r/w 20(b)(ii)(B), 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: మాదకద్రవ్యాల కొనుగోలు, వినియోగం, రవాణా చట్టరీత్యా నేరం. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు కోరారు.1