Shuru
Apke Nagar Ki App…
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బారాది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా మైసమ్మ తల్లి కి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తయారు చేసి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ రామ్ చంద్రయ్య,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
RAMU MUDIRAJ JOURNALIST
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బారాది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా మైసమ్మ తల్లి కి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తయారు చేసి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ రామ్ చంద్రయ్య,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బారాది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా మైసమ్మ తల్లి కి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తయారు చేసి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ ఎంపీటీసీ రామ్ చంద్రయ్య,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- हैदराबाद में अभी दवा कर पानी गिर रहा है मौसम बहुत अच्छा है बारिश हैदराबाद में गिर रहा है वह पानी किसानों के खेतों में गिरे तो उसकी फसल हो जाएगा मगर जहां पर पानी गिरना वहां नहीं पड़ रहा है1
- కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవతలకు బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల మోతలు, పోతురాజుల ఉత్సాహభరిత విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేయగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల షేకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.1
- బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్ హైదరాబాద్లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.1
- వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామపంచాయతీ ఈవో కృష్ణ తెలిపారు. ఇప్పటికే మూడు ఇళ్లు పూర్తికాగా, వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు. మరో 23 ఇళ్లు లింటెల్ దశకు చేరుకోవడంతో ఆ దశకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదనంగా 42 ఇళ్లలో బేస్మెంట్, గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈవో కృష్ణ తెలిపారు.1
- నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన! నాగర్కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో "నషా ముక్త్ భారత్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే. గీతాంజలి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వీడియో సందేశాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత, సామాజిక జీవితాలు నాశనమవుతాయని ప్రధాని హెచ్చరిస్తూ.. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కళాశాల అధ్యాపకులు హజీరా, ప్రవీణ, దీపిక, సుధాకర్, హుస్సేన్, బిల్కీస్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.1