Shuru
Apke Nagar Ki App…
Workers Demands || News Updates || KR NEWS 369 || Today News
KR NEWS 369
Workers Demands || News Updates || KR NEWS 369 || Today News
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు. గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.4
- Post by Saikumar1
- This cowardly act was met with the courage and resolve of our Armed Forces. With #OperationSindoor, Modi Govt ensured that no one dares to stand against India.1
- తాంసి మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి తాంసి,తలమడుగు మండలాల్లోని అంగన్ వాడి సూపర్ వైజర్లకు అంగన్ వాడి టీచర్లకు నూతన ఫోన్లు పంపిణీ చేశారు.1
- ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సమయం ప్రభుత్వం నిర్వహింప చేయాలని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ కోరారు. బుధవారం ఉదయం జన్నారంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవనం స్తంభించి పోయిందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.1
- Post by Vishwamber Rao1
- Post by KR NEWS 3691
- ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె వలన ప్రజలకు ఆటంకాలు ఏర్పడకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడుపుటకు అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఏ బస్సులోనైతే కండక్టర్ ఉండడో ఆ బస్సు ప్రయాణికులకు ఉచితంగా తమ గమ్యం వరకు చేర్చుటకు సహకరించడం జరుగుతుంది. కానీ మెట్పల్లి డిపో మేనేజర్ కల్పనాశీల కండక్టర్ లేకుండా నడిచే బస్సులలో కూడా ప్రయాణికుల వద్ద నుండి ఎలాంటి టికెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది2
- తాంసి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఆనాడు ఎవరు అడగకపోయిన కేసీఆర్ పేద బిడ్డల గురించి ఆలోచించి కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1