రాష్ట్ర హెల్త్ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ -జన విజ్ఞాన వేదిక పోలవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విజయవాడ లోని మాకినేని. బసవ పున్నయ్య విజ్ఞాన కళా క్షేత్రంలో ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం నాడు జరిగే రాష్ట్ర హెల్త్ సెమినార్ సదస్సు పోస్టర్స్ ను పోలవరం జిల్లా ఇంచార్జ్. యు. టి. ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్ గారి చేతులు మీదుగా పోస్టర్స్ ను ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా పోలవరం జిల్లా జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి పి. కన్నారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యం -తీరు తెన్నులు భవిష్యత్ పరిణామాలు,ప్రజారోగ్యం ప్రైవేటీకరణ -మౌళిక సదుపాయాలు అలాగే ప్రజాజీవన శైలి, ప్రపంచీకరణ ప్రభావం, పెరుగుతున్న ప్రజావసరాలు పై పూర్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్. పి. వి. రమేష్ ఐ. ఎ. ఎస్.రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ వైద్య నిపుణులు ముఖ్య వక్తగా హాజరు కావడం జరుగుతుంది. అందరు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో పోలవరం జిల్లా యు. టి. ఎఫ్. అధ్యక్ష/ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్ష/ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
రాష్ట్ర హెల్త్ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ -జన విజ్ఞాన వేదిక పోలవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విజయవాడ లోని మాకినేని. బసవ పున్నయ్య విజ్ఞాన కళా క్షేత్రంలో ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం నాడు జరిగే రాష్ట్ర హెల్త్ సెమినార్ సదస్సు పోస్టర్స్ ను పోలవరం జిల్లా ఇంచార్జ్. యు. టి. ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్ గారి చేతులు మీదుగా పోస్టర్స్ ను ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా పోలవరం జిల్లా జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి పి. కన్నారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యం -తీరు తెన్నులు భవిష్యత్ పరిణామాలు,ప్రజారోగ్యం ప్రైవేటీకరణ -మౌళిక సదుపాయాలు అలాగే ప్రజాజీవన శైలి, ప్రపంచీకరణ ప్రభావం, పెరుగుతున్న ప్రజావసరాలు పై పూర్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్. పి. వి. రమేష్ ఐ. ఎ. ఎస్.రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ వైద్య నిపుణులు ముఖ్య వక్తగా హాజరు కావడం జరుగుతుంది. అందరు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో పోలవరం జిల్లా యు. టి. ఎఫ్. అధ్యక్ష/ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్ష/ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
- Post by Sode Prasad1
- Post by V Ramarao3
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు1
- Post by Ramprasad islavath1
- Post by SS NEWS1
- రాజవొమ్మంగి, శుక్రవారం: మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్ సిబ్బందితో కలిసి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు.1
- Post by వేముల నాగరాజు1
- Post by వేముల నాగరాజు1