సంక్రాంతి సెలవులో ఇంట్లో చోరీ... ఇద్దరు అరెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి సెలవులో ఇంట్లో చోరీ... ఇద్దరు అరెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి
వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
- I want advertisement urgent hiring job urban company Housekeeping staff jobs1
- పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున తేదీ *05.03.2026* మరియు *06.03.2026* *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పురపాలక సంఘము మెదక్.1
- *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడారు1
- Post by వేణు విలేకరి1
- విశ్వజ్జనకళా మండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆరో తరగతి నుంచి చేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా నుండి రథయాత్ర ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు చేరుకుంది మెదక్ జిల్లాలో జై భీమ్ మహా సేన విశ్వజనకరమండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించి ఏడు డిమాండ్లను ప్రజలకు వివరించారు ఐదు ఏప్రిల్ లైవ్ నుంచి 11 నుంచి 13 వరకు ఏప్రిల్ నెల దీక్ష అప్పటికి రాజ్యాంగాన్ని చేర్పించకపోతే నాలుగు 14న అమ్మాయిల నిరాహార దీక్ష కోరుకుంటామని విశ్వ జన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి అంజన్న అశోక్ నాగేశ్వరరావు సురేష్ బాబు బాలస్వామి రాణి యాదమ్మ రమేష్ ఎల్లయ్య యాదన్న మొగులయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు1
- నల్లగొండ బ్రేకింగ్: తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని దళితులకు కేటాయించాలి.. *మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) డిమాండ్.!* మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి ఎమ్మార్పీఎస్ శ్రేణులు యత్నం... ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు హైఅలర్ట్ భారీ బందోబస్తు ఏర్పాటు... అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసులు..1
- కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ రాజేష్ చంద్ర ఏఎస్పి చైతన్య రెడ్డి సిఐ నరహరి ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్డుపై వరుసగా ఉంచి రోడ్డు రోలర్ తో తొక్కించడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని పట్టణ సీఐ నరహరి పోలీస్ బృందం వాహనదారులను హెచ్చరించడం జరిగింది.1