డంపింగ్ యార్డ్ సెగ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. దీక్షలపై నిఘా! వరంగల్ (GWMC), మార్చి 11: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ తరలింపు అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసన జరుగుతుండగా, నిన్న (మార్చి 10) మధ్యాహ్నం ఒక యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం నిరసనకారులపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది. నివేదికలోని కీలక అంశాలు: నిఘా నీడలో నిరసనకారులు: దీక్షలో పాల్గొన్న సుమారు 60 మంది వివరాలను సేకరించిన అధికారులు, వారి కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, వాగన్ కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. హైటెన్షన్ విద్యుత్ తీగల కింద టెంట్లు వేయడం, రద్దీగా ఉండే బస్ స్టాప్లు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు మార్కెట్ ప్రాంతాలకు అతి సమీపంలో నిరసనలు తెలపడం వల్ల ప్రజా భద్రతకు విఘాతం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు. అనుమతి నిరాకరణకు ఆస్కారం: ఫైర్ సర్వీస్, విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఇక్కడ దీక్షలకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరణ ప్రధానంగా స్మశాన వాటిక మరియు కర్ర కోత మిషన్ల వంటి సున్నిత ప్రాంతాల గుండా ఊరిలోకి వెళ్లే ప్రధాన మార్గంలో ఆందోళనలు ట్రాఫిక్కు మరియు అత్యవసర సేవలకు (అంబులెన్స్) అడ్డంకిగా మారాయి. రాజకీయ రంగు: త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన పార్టీలు ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. నిన్నటి ఘటన వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారుల హెచ్చరిక: శాంతియుత నిరసనల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించినా, ప్రభుత్వ అధికారులను దూషించినా కఠిన చర్యలు తప్పవని యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టిన డంపింగ్ యార్డ్ పోరాటం, శాంతిభద్రతల సమస్యగా మారకుండా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
డంపింగ్ యార్డ్ సెగ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. దీక్షలపై నిఘా! వరంగల్ (GWMC), మార్చి 11: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ తరలింపు అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసన జరుగుతుండగా, నిన్న (మార్చి 10) మధ్యాహ్నం ఒక యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం నిరసనకారులపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది. నివేదికలోని కీలక అంశాలు: నిఘా నీడలో నిరసనకారులు: దీక్షలో పాల్గొన్న సుమారు 60 మంది వివరాలను సేకరించిన అధికారులు, వారి కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, వాగన్ కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. హైటెన్షన్ విద్యుత్ తీగల కింద టెంట్లు వేయడం, రద్దీగా ఉండే బస్ స్టాప్లు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు మార్కెట్ ప్రాంతాలకు అతి సమీపంలో నిరసనలు తెలపడం వల్ల ప్రజా భద్రతకు విఘాతం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు. అనుమతి నిరాకరణకు ఆస్కారం: ఫైర్ సర్వీస్, విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఇక్కడ దీక్షలకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరణ ప్రధానంగా స్మశాన వాటిక మరియు కర్ర కోత మిషన్ల వంటి సున్నిత ప్రాంతాల గుండా ఊరిలోకి వెళ్లే ప్రధాన మార్గంలో ఆందోళనలు ట్రాఫిక్కు మరియు అత్యవసర సేవలకు (అంబులెన్స్) అడ్డంకిగా మారాయి. రాజకీయ రంగు: త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన పార్టీలు ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. నిన్నటి ఘటన వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారుల హెచ్చరిక: శాంతియుత నిరసనల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించినా, ప్రభుత్వ అధికారులను దూషించినా కఠిన చర్యలు తప్పవని యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టిన డంపింగ్ యార్డ్ పోరాటం, శాంతిభద్రతల సమస్యగా మారకుండా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో శ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు..3
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో.. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పని ఒక రైతును రోడ్డున పడేసింది. గ్రామానికి చెందిన రైతు గుండగాని రాజు, తనకున్న పొలంలో ఎంతో ఆశతో మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండిందని, ఈసారి మంచి దిగుబడి వస్తుందని సంతోషిస్తున్న తరుణంలో.. కొందరు దుండగులు పంట చేనుకు నిప్పు పెట్టారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో మొక్కజొన్న కంకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయిపొలానికి వెళ్లిన రాజుకు.. కాలిపోయిన పంటను చూసి గుండె తరుక్కుపోయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తనకు, ఇప్పుడు మిగిలింది కేవలం బూడిదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గుండగాని రాజు వేడుకుంటున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.2
- మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి. మార్చి15 న హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే హమాలీ మహా గర్జనను విజయవంతం చేయాలని హమాలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అట్టి హమాలి మహాగర్జన సభకు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.1
- హన్మకొండ:అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్లో చేపడుతున్న అభివృద్ధి పనులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతలతో పరిశీలించారు. రైల్వే అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు.1
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.1
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.1