జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ముఖేష్ ఖన్నా ఫైర్ జగిత్యాల, తేదీ03: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ముఖేష్ ఖన్నా ఫైర్ జగిత్యాల, తేదీ03: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు
— జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న
కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రివద్ద
ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
- జగిత్యాల, తేదీ03: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.4
- ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు మొదట తన కుటుంబం ఎక్కడ నుంచి ఎదిగిందో గుర్తు చేసుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలే అరవింద్ కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు రాష్ట్ర పీసీసీ నాయకులు అరవింద్ పై తీవ్ర విమర్శలు చేశారు1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ, ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేదార్నాథ్ గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాతలు కరీంనగర్కు చెందిన గందె శ్రీ శ్రీనివాస్,రాచమల్ల ప్రసాద్,ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్ కొండూరి వేణుగోపాల్ కేదార్నాథ్ గుడి నిర్మాణ భూమి పూజ ఆలయ కమిటీ చైర్మన్ వారాల పరశురాములు, అక్క నా పెళ్లి రాజేష్ విజయ్ మసాలా తో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గాలి పెళ్లి శంకర్ భక్తులు పాల్గొన్నారు1
- కరీంనగర్ పీఎంజే జువెలరీ కాల్పుల ఘటనలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు వైద్యులను కోరారు.1
- కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు. కరీంనగర్ నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంపు దాటినాక ఘోరంగా లారీ మరియు కారు గుద్దుకున్న విషయం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ గాయాలు జరగలేదు. కారు డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డ కారు డ్రైవర్. నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోయిన కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.4
- జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్లోని PMJ జ్యువెలరీ షోరూమ్లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.2
- హిందూ ఏక్తా యాత్రతో చరిత్ర స్రుష్టిద్దాం హిందువుల సంఘటనా శక్తిని చాటి చెబుదాం* *స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు* *వినూత్న రీతిలో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి యాత్రకు ఆహ్వానించండి* *మండలాల వారీగా వేలాది మందిని యాత్రకు తీసుకురండి* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు *కరీంనగర్ లో కార్పొరేటర్లు, కంటెస్టెడ్ అభ్యర్థులు, పార్టీ జిల్లా నేతలతో బండి సంజయ్ సమావేశం* *ఏక్తా యాత్ర ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చ* కరీంనగర్ లో ఈనెల 12న నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను కనీవినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసి మరోసారి చరిత్ర స్రుష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ హిందూ ఏక్తా యాత్రకు చిన్నా, పెద్దా, ముసలి ముతకా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. యాత్రకు తరలివచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, వారికి తగిన రవాణా ఏర్పాట్లు చేసి యాత్రకు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఏక్తా యాత్రపై మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం నిర్వహించాలని కోరారు. పార్టీ నాయకులంతా తమ తమ వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి వినూత్న రీతిలో బొట్టు పెట్టి ఏక్తా యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ అభ్యర్థులు తమ తమ డివిజన్లలో భారీ ఎత్తున ప్రజలను ఏక్తా యాత్రలో పాల్గొనేలా భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 12న కరీంనగర్ లో నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ ఏర్పాట్లు, జన సమీకరణపై ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని గాయత్రీనగర్ బ్యాంకెట్ హాలులో ఉదయం జిల్లా నాయకులతో, సాయంత్రం జ్యోతినగర్ లోని శ్రీ మహాశక్తి బాంక్వెట్ హాలులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డి.శంకర్, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే... ఈనెల 12న కరీంనగర్ లో నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను దిగ్విజయవంతం చేద్దాం. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే హిందువుల యాత్ర ఇది. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా, మహిళా, యువత అనే తేడా లేకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రజలందరినీ ఏక్తా యాత్రలో భాగస్వాములను చేద్దాం. తద్వారా హిందువుల సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెబుదాం. కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే యాత్రకు ఈసారి కనీవినీ ఎరగని రీతిలో జనాన్ని భాగస్వాములను చేసి ఏక్తా యాత్రను సక్సెస్ చేద్దాం. అందరం కష్టపడి పనిచేద్దాం. హిందూ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన నేపథ్యంలో ఆ స్పూర్తితో ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం. మండలాల నుండి అధిక సంఖ్యలో తరలిస్తే వారంతా హిందుత్వం కోసం పనిచేసే యువకులుగా మారే అవకాశమిద్దాం. పండుగ వాతావరణంలో యాత్రకు తరలి రావాలని వినూత్న రీతిలో ప్రజలను ఆహ్వానించాలి. మే 12న, సాయంత్రం 4 గంటలకు, వైశ్యా భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభం అనే అంశాన్ని ప్రతి ఒక్కరి మైండ్ లో ఫిక్స్ అయ్యేలా ప్రచారం చేయండి. ప్రతి వార్డులో, డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. వాల్ రైటింగ్ రాయించండి. రేపటి నుండే మండలాలు, గ్రామాల, పోలింగ్ బూత్ ల వారీగా మీటింగ్ నిర్వహించాలి. మీడియా, సోషల్ మీడియా వేదికలుగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించండి.1