*జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలోని 16వ వార్డు భీంనగర్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యం పై స్థానికులు అగ్రహం* గద్వాల పట్టణంలోని 16వ వార్డు భీంనగర్ ఏరియాలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తీవ్రరూపం దాల్చాయి రోడ్లనుసందులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక నివాసితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీకి సంబంధించిన 10% మరియు 5% భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని స్థానిక భీంనగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 3 షెడ్లు నిర్మించి ప్రభుత్వ స్థలాన్ని,రోడ్డును ఆక్ర మించుకున్నారని వార్డు ప్రజలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ పరిశీలించినాస్పందన శూన్యం అన్నారు ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మున్సిపల్ కమిషనర్కు నేరుగా ఫిర్యాదు చేయడం జరిగిందన్ని కమిషనర్ స్వయంగా వచ్చి పరిశీలించి,ఇది 100% అక్రమ నిర్మాణమని వీటిని వెంటనే తొలగిస్తా మని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కమిషనర్ హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు గడిచినా మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాక్టీసింగ్ హైస్కూల్ శివాలయం ముందు ఉన్న ప్రాంతాలతో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు కూడా రోడ్లను రెవెన్యూ సందులను ఆక్రమించి కట్టడాలు, షెడ్లు, కార్ పార్కింగ్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు గద్వాల మున్సిపాలిటీలోనే అత్యధిక రెవెన్యూ తెచ్చిపెట్టే భీంనగర్ ప్రాంతంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు,కలెక్టర్ స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో 16వ వార్డు ప్రజలు, కౌన్సిలర్ మద్దతుతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
*జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలోని 16వ వార్డు భీంనగర్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యం పై స్థానికులు అగ్రహం* గద్వాల పట్టణంలోని 16వ వార్డు భీంనగర్ ఏరియాలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తీవ్రరూపం దాల్చాయి రోడ్లనుసందులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక నివాసితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీకి సంబంధించిన 10% మరియు 5% భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని స్థానిక భీంనగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 3 షెడ్లు నిర్మించి ప్రభుత్వ స్థలాన్ని,రోడ్డును ఆక్ర మించుకున్నారని వార్డు ప్రజలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ పరిశీలించినాస్పందన శూన్యం అన్నారు ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మున్సిపల్ కమిషనర్కు నేరుగా ఫిర్యాదు చేయడం జరిగిందన్ని కమిషనర్ స్వయంగా వచ్చి పరిశీలించి,ఇది 100% అక్రమ నిర్మాణమని వీటిని వెంటనే తొలగిస్తా మని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కమిషనర్ హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు గడిచినా మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాక్టీసింగ్ హైస్కూల్ శివాలయం ముందు ఉన్న ప్రాంతాలతో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు కూడా రోడ్లను రెవెన్యూ సందులను ఆక్రమించి కట్టడాలు, షెడ్లు, కార్ పార్కింగ్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు గద్వాల మున్సిపాలిటీలోనే అత్యధిక రెవెన్యూ తెచ్చిపెట్టే భీంనగర్ ప్రాంతంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు,కలెక్టర్ స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో 16వ వార్డు ప్రజలు, కౌన్సిలర్ మద్దతుతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
- ఎస్ఐఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ధ్రువపత్రాలు సేకరించాలి అనవసర పత్రాలు ఇవ్వాలని ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దు. ఎస్ఐఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ధ్రువపత్రాలు సేకరించాలి కలెక్టర్ స్పష్ట్తీకరణ . ఏ, బీ, సీ కేటగిరీలపై బిఎల్ఓలకు స్పష్టత ఉండాలి. నోమ్యాపింగ్, అనామిలిస్ జాబితా ఓటర్ల పరిశీలనలో కలెక్టర్ ఆదేశాలు. మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న ఓటర్లతో అనవసర ధ్రువపత్రాలు సేకరించకుండా, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే పత్రాలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రములోని 16వ, 30వ వార్డులకు సంబంధించి 250, 255, 256 పోలీస్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓ లు నిర్వహిస్తున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఓటర్ల నుంచి సేకరించిన ధ్రువపత్రాలను పరిశీలించిన కలెక్టర్ కొందరి నుంచి అవసరానికి మించి పత్రాలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల్లో లేని డాక్యుమెంట్లని ప్రజలను అడగవద్దని బిఎల్ఓ లకు స్పష్టం చేశారు. అనవసరమైన జిరాక్స్ల కోసం ప్రజలు డబ్బులు ఖర్చు చేయడంతో పాటు, ఒకే పని కోసం పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. ప్రతి నో మ్యాపింగ్ కేసును ముందుగా ఏ, బీ, సీ కేటగిరీలుగా సరిగ్గా గుర్తించాలని సూచించారు. ఏ కేటగిరీకి ఎన్ని పత్రాలు అవసరమో సిబ్బంది స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. అవసరమైన పత్రాల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల తర్వాత ఆన్లైన్ పరిశీలనలో సమస్యలు, తిరస్కరణలు ఏర్పడి సిబ్బందికి రెట్టింపు పని అవుతుందని పేర్కొంటూ సరైన అవగాహన, స్పష్టతతో ముందుకెళ్లాలన్నారు. మ్యాపింగ్ కానీ జాబితాలో ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లి నోటీసు అందజేసిన తర్వాత అవసరమైన పత్రాల గురించి వివరించి సేకరించాలని ఆదేశించారు. ప్రజలకు మొదటి దశలోనే స్పష్టంగా సమాచారం ఇవ్వాలని, పత్రం మిస్ కావడం లేదా అనవసరమైన పత్రం తీసుకోవడం వల్ల వారిని పలుమార్లు తిప్పించుకునే పరిస్థితి ఉండకుండా వ్యవహరించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో స్పష్టత లేని క్షేత్రస్థాయి సిబ్బందికి మరోసారి సమగ్రంగా శిక్షణ ఇవ్వాలని అదనపు ఏఈఆర్ఓ ను ఆదేశించారు. ఏ, బీ, సీ కేటగిరీల గుర్తింపు, అవసరమైన ధ్రువపత్రాలు, ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానంపై సమగ్రంగా అవగాహన కలిగించాలని సూచించారు.సందేహాస్పద కేసులను వెంటనే తిరస్కరించకుండా, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు వేదవతి, చంద్రశేఖర్, అదనపు ఏఈఆర్ వో సతీష్, సూపర్వైజర్ లు మృదుల, తిమ్మప్ప, బిఎల్వోలు వెంకట నరసమ్మ, మంజుల రాణి, సునీత, తదితరులు పాల్గొన్నారు.1
- *జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలోని 16వ వార్డు భీంనగర్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యం పై స్థానికులు అగ్రహం* గద్వాల పట్టణంలోని 16వ వార్డు భీంనగర్ ఏరియాలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తీవ్రరూపం దాల్చాయి రోడ్లనుసందులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక నివాసితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీకి సంబంధించిన 10% మరియు 5% భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని స్థానిక భీంనగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 3 షెడ్లు నిర్మించి ప్రభుత్వ స్థలాన్ని,రోడ్డును ఆక్ర మించుకున్నారని వార్డు ప్రజలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ పరిశీలించినాస్పందన శూన్యం అన్నారు ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మున్సిపల్ కమిషనర్కు నేరుగా ఫిర్యాదు చేయడం జరిగిందన్ని కమిషనర్ స్వయంగా వచ్చి పరిశీలించి,ఇది 100% అక్రమ నిర్మాణమని వీటిని వెంటనే తొలగిస్తా మని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కమిషనర్ హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు గడిచినా మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాక్టీసింగ్ హైస్కూల్ శివాలయం ముందు ఉన్న ప్రాంతాలతో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు కూడా రోడ్లను రెవెన్యూ సందులను ఆక్రమించి కట్టడాలు, షెడ్లు, కార్ పార్కింగ్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు గద్వాల మున్సిపాలిటీలోనే అత్యధిక రెవెన్యూ తెచ్చిపెట్టే భీంనగర్ ప్రాంతంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు,కలెక్టర్ స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో 16వ వార్డు ప్రజలు, కౌన్సిలర్ మద్దతుతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.1
- శ్రీకృష్ణ కాల చక్రం పూజలు జిల్లా వనపర్తి మర్రికుంట లొ జరుపుకోవాలని మన ప్రియతమా నాయకుడు మేఘరెడ్డి గారు ప్రజలు క్షేమం కోసం పూజలు జరిపిచాటం చేస్తున్నారు శ్రీ కృష్ణ కాల చక్రం ప్రజలు అందరూ ఎళ్ళావేళ్ళాల ఆయురారోగ్యాలతో ఉండాలని శివుడుకి మరియు అమ్మవారికి పూజలు మరియు హోమం లు చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం. అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గోని ప్రజలు విక్షిస్తున్నారు.2
- కేశంపేట:పాటిగడ్డలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి కానుక కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలో నిరుపేద కుటుంబానికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారు పాపకంటి శిరీష శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్, గ్రామ సర్పంచ్ అకిల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, నిర్ధవెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారుల కుటుంబాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన చిప్పగిరి మండలం జనసేన పార్టీ నాయకులు కే చిరంజీవి ఆలూరు ఆరోగ్య కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండల నాయకుడు చిరంజీవి, ప్రవీణ్ కుమార్, నాగమణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.1
- రైతుల కోసం గొడ్డల పార్టీ నాయకులు డ్రామా అంటున్న MLA గిత్తజయసూర్య వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ డ్రామాలు – నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల: వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ నేతలు చేస్తున్నది రైతుల కోసం పోరాటం కాదని, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న డ్రామాలని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు తీవ్రంగా విమర్శించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్లే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. నీటి లభ్యతపై ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పటికీ, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి డ్రామాలు హడావుడి చేయడం సరికాదన్నారు. “రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారో ముందుగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతుల ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలను వైసీపీ నేతలు మరిచిపోయారా?” అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను మరియు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం నెలకొన్న సాగునీటి సమస్యపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రైతులకు సాధ్యమైనంత మేర సాగునీరు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్టిలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు, ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. రైతుల కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.1
- ఆత్మకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు: వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి ఆత్మకూరు మండలం నల్ల కాలువలో దివంగత నేత డాక్టర్ వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ శృతి వనంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం నాగల్ ధిన్నే నదిలో ముసలి కలకలం, గ్రామస్థులు పట్టుకొవడం జరిగింది.1