Shuru
Apke Nagar Ki App…
అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
Zakeer
అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.1
- అలంపూర్: ట్రాన్స్ఫారం కు కంచె ఏర్పాటు చేయండి!!!స్థానికుల వినతి... అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న మండల మహిళా సమైక్య భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫారంకు కంచె లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అటుగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫారంకు కంచె ఏర్పాటు చేసి ప్రమాదం జరగకముందే స్పందించాలని కోరుతున్నారు.1
- పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.1
- నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.1
- అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.1
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జూపల్లి*_ _*💥💥అభివృద్ధే లక్ష్యంగా ముందుకు*_ _*రహదారుల విస్తరణ, మరమ్మత్తులకు నిధులు*_ _*ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి*_ కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని *పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు* అన్నారు. నియోజకవర్గంలోని రహదారుల విస్తరణ, మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఏదుల మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 36 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు._ _👉నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా రహదారుల విస్తరణ, మరమ్మతుల పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించలేదని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు._ _👉పిల్లలకు విద్యతో పాటు విలువలు, సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. పిల్లల స్నేహాలు, వారి నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబంలో మంచి వాతావరణం కల్పించడం ద్వారా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు._3