వేలాది రామ భక్తుల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
వేలాది రామ భక్తుల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.1
- నవాబ్ పేట మండలం లింగం పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక1
- గద్వాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీసీతారాముల వారి కళ్యాణం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ఆధ్వర్యములో అంగరంగ వైభోగంగా జరుపడం జరిగింది. ----->>>>----<<<<----- జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రము శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణములో ఆర్యవైశ్య పట్టణ సంగం అధ్యక్షులు, ఆర్యవైశ్య యువజన సంగం సభ్యుకు పట్టన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగింది.1
- Gadwal: శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా నీలహల్లి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఇతర వసతి ఏర్పాట్లు చేశారు. గ్రామంలో శ్రీరామ నామ స్మరణతో భక్తి పారవశ్యం నెలకొంది. కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల గ్రామానికి శుభం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.1
- మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.1
- వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.2
- Post by Ali ammu1