Shuru
Apke Nagar Ki App…
గాజువాక బీసీ గేట్ వద్ద ప్రయాణిస్తున్న ఓ వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు గాజువాక బీసీ గేట్ వద్ద ప్రయాణిస్తున్న ఓ వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వాహనం నడుస్తుండగానే ఇంజిన్ భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనంలో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడున్న తోటి ప్రయాణికులు పెట్రోల్ బంక్లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు
Gompa manoj kumar
గాజువాక బీసీ గేట్ వద్ద ప్రయాణిస్తున్న ఓ వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు గాజువాక బీసీ గేట్ వద్ద ప్రయాణిస్తున్న ఓ వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వాహనం నడుస్తుండగానే ఇంజిన్ భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనంలో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడున్న తోటి ప్రయాణికులు పెట్రోల్ బంక్లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” పిలుపులో భాగంగా ఎన్ఏడి కోడలి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అంటించిన వాల్ పోస్టర్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో జెడి ఫౌండేషన్ మరియు ఈస్ట్రన్ ఘాట్స్ ట్రెక్కింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, జీవీఎంసీ వారు విశాఖను సుందర విశాఖగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న సమయంలో కొంతమంది నిబంధనలు అతిక్రమించి గోడలపై పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, జై భారత్ అసోసియేషన్ సభ్యులు కోరారు.4
- కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.1
- VZM: శృంగవరపుకోట పట్టణంలో దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.1
- Post by కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్1
- రహదారి మంజూరు రెండు గ్రామాల మధ్య వివాదం రేపగా..వారు కొట్టుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామం రోడ్డు నిర్మాణానికి ఇటీవల రూ. 90 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. పనులు కోర్రుబయలు గ్రామం మీదుగా చేపట్టనుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం మంగళవారం ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది.1
- Post by Shyam1
- రేడియేషన్ నియంత్రణ గ్రహణ సమయంలో భూమిపై పడే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుండి ఆహార పదార్థాలను రక్షించడానికి గరికను ఉపయోగిస్తారు. పవిత్రత మరియు రక్షణ: గరిక (దర్భ) ను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది అపవిత్రతను లేదా గ్రహణ సమయంలో సంభవించే ప్రతికూల శక్తులను (Negative Energy) నివారిస్తుందని నమ్ముతారు.సహజ నిల్వ కారకం (Natural Preservative): గరిక యాంటీ రేడియేషన్ మరియు బ్యాక్టీరియాను నిరోధించే లక్షణాలను కలిగి ఉంది. ఇది పెరుగు, పాలు, వండిన ఆహార పదార్థాలు, ఊరగాయలు పాడవకుండా లేదా బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. శాస్త్రీయ కారణం: పరిశోధనల ప్రకారం, దర్భ గడ్డి రేడియేషన్ను, ముఖ్యంగా ఎక్స్-రేలను కూడా కొంతవరకు శోషించుకుంటుంది (absorb). అందుకే, గ్రహణ సమయంలో వండిన పదార్థాలు, నీటి పాత్రలు, నిల్వ ఉంచిన ధాన్యంపై ఈ గడ్డిని వేస్తారు. ప్రధాన ఉపయోగాలు ఆహార రక్షణ ఆహార పదార్థాలపై గరికను వేయడం వల్ల ఆహారం నిల్వ ఉంటుంది, విషతుల్యం కాదు. నీటి శుద్ధి: మంచి నీటి పాత్రలలో గరికను ఉంచడం వల్ల నీరు శుద్ధి అవుతుంది.గ్రహణ సమయంలో చేసే దానధర్మాలు, జపాలు, తర్పణాల సమయంలో దర్భల రంగును (పవిత్రి) ధరించడం శుభప్రదంగా భావిస్తారు. గ్రహణ సమయంలో గరికను వాడటం అనేది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక పవిత్రమైన మరియు శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ గడ్డిని తీసివేసి, స్నానం ఆచరించడం మంచిది.1
- గాజువాక బీసీ గేట్ వద్ద ప్రయాణిస్తున్న ఓ వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వాహనం నడుస్తుండగానే ఇంజిన్ భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనంలో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడున్న తోటి ప్రయాణికులు పెట్రోల్ బంక్లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు1