రఘు నాథపాలెం మండలం రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులకు ఇంప్లిమెంట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.... ......గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టు పక్కల భూకబ్జాలు పెట్రేగి పోయాయి .....నక్సలైట్లు పోరాటాలు చేసి చివరికి ప్రజాస్వామ్య పద్ధతిలో లొంగిపోతున్నారు ..వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం ఉదారంగా ఉండాలా .వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9 న ప్రారంభోత్సవం ....పేదల సంఘం ముసుగులో పేదల వద్ద లక్షలు వసూళ్లు చేసి నకిలీ పట్టాలు ఇచ్చిన అక్రమార్కుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా ....అరాచకం రాజ్య మేలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా .నీళ్లు కరెంట్ రోడ్లు లేకుండా దుర్భర పరిస్థితిలో పేదలు ఎందుకు ఉండాలి ...పేదల కోసం నిలబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూశారు ..పేదల ఇళ్ళు కూల్చే దౌర్భాగ్యం నాకెందుకు కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగించారు ...గ్రామ పరిపాలనలో అన్ని శాఖలపై సర్పంచ్ లు బాధ్యత వహించాలి..గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పై ప్రజలను భాగస్వామ్యం చేయాలి ...పామాయిల్ సాగు విస్తరణ పై గ్రామాల్లో సర్పంచ్ లు చొరవ తీసుకోవాలి .ఈ నెల 22 న సిద్దిపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాంరఘు నాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలిరాజకీయాల్లో నిజాయితీ గా ఉండాలంటే వ్యవసాయం పై ఆదాయం ఉండాలి మంచుకొండ ఎత్తి పోతల పథకం..యంగ్ ఇండియా స్కూల్..స్వామి నారాయణ గురుకుల పాఠశాల..ప్రభుత్వ మెడికల్ కళాశాల నేనే తెచ్చా .రఘు నాథపాలెం మండలానికి మహర్దశ పట్టేలా అబివృద్ధి
రఘు నాథపాలెం మండలం రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులకు ఇంప్లిమెంట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.... ......గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టు పక్కల భూకబ్జాలు పెట్రేగి పోయాయి .....నక్సలైట్లు పోరాటాలు చేసి చివరికి ప్రజాస్వామ్య పద్ధతిలో లొంగిపోతున్నారు ..వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం ఉదారంగా ఉండాలా .వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9 న ప్రారంభోత్సవం ....పేదల సంఘం ముసుగులో పేదల వద్ద లక్షలు వసూళ్లు చేసి నకిలీ పట్టాలు ఇచ్చిన అక్రమార్కుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా ....అరాచకం రాజ్య మేలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా .నీళ్లు కరెంట్ రోడ్లు లేకుండా దుర్భర పరిస్థితిలో పేదలు ఎందుకు ఉండాలి ...పేదల కోసం నిలబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూశారు ..పేదల ఇళ్ళు కూల్చే దౌర్భాగ్యం నాకెందుకు కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగించారు ...గ్రామ పరిపాలనలో అన్ని శాఖలపై సర్పంచ్ లు బాధ్యత వహించాలి..గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పై ప్రజలను భాగస్వామ్యం చేయాలి ...పామాయిల్ సాగు విస్తరణ పై గ్రామాల్లో సర్పంచ్ లు చొరవ తీసుకోవాలి .ఈ నెల 22 న సిద్దిపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాంరఘు నాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలిరాజకీయాల్లో నిజాయితీ గా ఉండాలంటే వ్యవసాయం పై ఆదాయం ఉండాలి మంచుకొండ ఎత్తి పోతల పథకం..యంగ్ ఇండియా స్కూల్..స్వామి నారాయణ గురుకుల పాఠశాల..ప్రభుత్వ మెడికల్ కళాశాల నేనే తెచ్చా .రఘు నాథపాలెం మండలానికి మహర్దశ పట్టేలా అబివృద్ధి
- రోడ్డు దాటుతున్న మహిళను ఆటో ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో మహిళను ఢీకొంది.. ఈ ప్రమాదంలో మహిళ ఒక్కసారిగా కింద పడిపోవటం తో గాయాలయ్యాయి.. స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- సీరోల్ మండలం కాంపల్లి శివారులోని అచ్చమ్మ దాబా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే దాబా పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దాబా దగ్ధమైనట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.1
- పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు1
- నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్ రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్, మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత ముంజాల రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజానికి రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మన్యవర్ కాన్షిరాం తన జీవితాన్ని బహుజన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. మండల్ కమిషన్ అమలుకు ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1990లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బహుజనులకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయని కాన్షిరాం ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో బహుజన ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ అధికారాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.2
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.2
- సత్తుపల్లి యం యల్ ఏ, తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పెద్ద పాప కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.... సత్తుపల్లి నియోజకవర్గం వర్గ ప్రజలు1
- ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు ఈ సందర్భంగా చాపరాలపల్లి గ్రామంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు .. అనంతరం అదే గ్రామంలో పర్సా తిరుమలయ్య, నల్లమోతు సత్యం మరియు వి.కె రామవరం (కొత్తూరు) గ్రామంలో ఆంగోతు రోజా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ములకలపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న పంచాయతీ సిబ్బందిని గౌరవిస్తూ ఎమ్మెల్యే వారి చేతులతో పంచాయతీ సిబ్బంది కాళ్లు కడిగి ఘనంగా సత్కరించారు ఈ సంఘటన అక్కడ ఉన్న వారిని ఎంతో ఆకట్టుకుంది ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా నడవడానికి పంచాయతీ సిబ్బందిచేస్తున్న కృషి ఎంతో గొప్పదని తెలిపారు వారి సేవలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు .2
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని గాలివారిగుండెం గ్రామంలోని ఏఎన్ఆర్ గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం దొంగిలించబడిన బైక్ విషయంలో మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాలలో విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించారు. ఈ కేసులో నిందితులలో ఇద్దరైన వాంకుడోత్ గోపీచంద్ (తండ్రి: హస్సలా, నివాసం: హస్లా తండా, ఆత్మకూరు (ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా) మరియు గుగులోత్ మనోజ్ (తండ్రి: గోరియ, నివాసం: గోల్ తండా గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా)లను ఈరోజు మరిపెడలోని కార్గిల్ సెంటర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మూడు బైకులను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుని రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయాకిన్ని మరిపెడ ఎస్ఐ ఈ. వీరభద్రరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.1