Shuru
Apke Nagar Ki App…
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి సిఐటియు నాయకులు మూషం రమేష్ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.
Satheesh gangu
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి సిఐటియు నాయకులు మూషం రమేష్ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రజల సహకారంతోనే పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచేందుకు ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడ మండలం తెట్టెకుంట శివారులో వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతనంగా సమకూర్చిన యంత్రాలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణాల్లో చెత్త సేకరణ, చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే పొడి వనరుల సేకరణ కేంద్రం ఉండగా, ఇప్పుడు ఆ కేంద్రంలో ఏజెన్సీ ద్వారా నూతనంగా సమకూర్చిన యంత్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఈ యంత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నామని తెలిపారు. సేకరించిన పొడి చెత్తను ఈ కేంద్రానికి తీసుకువచ్చి యంత్రాల సహాయంతో ప్రాసెస్ చేసి కంపోస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల చెత్త నిర్వహణ సక్రమంగా జరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.ప్రజలు తమ ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వాహనాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు కంపార్ట్మెంట్లలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్తను వేరు చేయడం వల్ల రీసైక్లింగ్ ప్రక్రియ సులభమవుతుందని, తడి చెత్త, పొడి చెత్త కలిసిపోవడం వల్ల డంపింగ్ యార్డుల్లో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని తెలిపారు.ఈ డీఆర్సీసీ కేంద్రంలో ఒక బేలింగ్ మెషిన్, ఒక వెయిమెంట్ మెషిన్ ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. అలాగే కంపోస్ట్ కేంద్రం కూడా 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, తూమ్ మధు, ఎల్ల శ్రీనివాస్, తోట రాజు, కాషా శ్రీనివాస్, మూడపల్లి నీలమ్మ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తమకు నెలకు 26 వేల గౌరవ వేతనం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జి.ఓ. విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలపడం గమనార్హం. ఆశా వర్కర్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన పారితోషికం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల ఇందిరా భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.1
- జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి సంవత్సరం క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అబ్బాయి పేరెంట్స్ ప్రేమ పెళ్లిని ఒప్పుకోకపోయినప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే ఉంటున్నారు. ఏమైందో ఏమో తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన వైష్ణవి ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో భర్త హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ మృతురాలు వైష్ణవి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి అబ్బాయి తల్లిదండ్రుల నుండి ప్రోద్బలంతోనే భార్యపై కత్తితో దాడి చేసినట్లు మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని హత్య చేసిన హరిబాబు కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టిన పోలీసులు భర్త హరిబాబు తో పాటు ఆయన పేరెంట్స్ పై కేసు నమోదు చేశామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాములు తెలిపారు.4
- కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.1
- అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.2
- ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని మూషం రమేష్ కోరారు.1