Shuru
Apke Nagar Ki App…
🔔 Alert! This is your final reminder—No Excuses! 🤙🏻😌🔥 🔔 Alert! This is your final reminder—No Excuses! 🤙🏻😌🔥
M.RAJKIRAN REDDY
🔔 Alert! This is your final reminder—No Excuses! 🤙🏻😌🔥 🔔 Alert! This is your final reminder—No Excuses! 🤙🏻😌🔥
More news from తెలంగాణ and nearby areas
- ఆదిలాబాద్ అర్బన్ :తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం RTC కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్ పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కార్మికుల కష్టాలను ప్రభుత్వం గాలికొదిలేయడం సరికాదని,వారి డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి,కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా సమ్మెలో ఉన్న కండక్టర్ల పేరు మీద టికెట్లు ఇష్యూ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అక్రమ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇది కార్మికులను మోసం చేయడమేనని మండిపడ్డారు,అలాగే కార్మికులు చేస్తున్న పోరాటం కేవలం వారి హక్కుల కోసమే కాదని,ఆర్టీసీ మనుగడ కోసమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని,వారి పోరాటం విజయవంతం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. తాళ్ల రవీందర్ ప్రకటనతో సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.1
- జన్నారం మండల కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జన్నారం మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ప్రతి వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మళ్లీ కష్టాలు తప్పవని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలోపు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- वरंगल जिला, राज्यव्यापी आरटीसी हड़ताल की तनावपूर्ण स्थिति के बीच वरंगल जिले में सनसनीखेज घटना हुई। नरसंपेट आरटीसी डिपो में कार्यरत ड्राइवर शंकर गौड़ ने अपनी समस्याओं का समाधान करने की मांग करते हुए आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की मांगों पर सरकार से प्रतिक्रिया की अपील करते हुए उन्होंने अपने ऊपर पेट्रोल डालकर आत्महत्या करने की कोशिश की। घटना को देखकर सहकर्मियों और स्थानीय लोगों ने तुरंत हस्तक्षेप कर उन्हें बचा लिया। गंभीर रूप से घायल शंकर गौड़ को तत्काल इलाज के लिए वरंगल के अस्पताल में भर्ती कराया गया है, जहां डॉक्टर उनका उपचार कर रहे हैं। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और चिंता और बढ़ गई है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है। तेलंगाना से न्यूज़ फर्स्ट के लिए रमेश सोलंकी की रिपोर्ट1
- Post by Solanke Ravi1
- కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ గారిపై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ - తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హరీష్ రావు. పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్, రాజా పూర్ణనందం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి. మీ కేనాల్స్, పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం,దయాకర్,రవి,సుంకరి రాములు,మోహన్ దాస్ ,అశోక్, పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా.... ఈరోజు జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా చేతన్ నితిన్ (ఐపీఎస్) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్) ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేయడం జరిగింది.చేతన్ నితిన్ ఐపిఎస్., 2022 బ్యాచ్కు చెందిన అధికారి. గతంలో జనగామ ఏఎస్పి గా విధులు నిర్వర్తించారు.1
- 🔔 Alert! This is your final reminder—No Excuses! 🤙🏻😌🔥1
- Post by Solanke Ravi1
- జగిత్యాల తెలంగాణ రాష్ట్ర పొర సరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆద్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్....అదనపు కలెక్టర్ బి ఎస్ లతతో కలిసి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, DCO మనోజ్ కుమార్, Dcso జితేందర్ రెడ్డి, తహసీల్దార్ హకీం, DMO ప్రకాష్, సెక్రటరీ శ్రీనివాస్ రావు, ఏఎంసి డైరెక్టర్లు జయరాం, సురేష్, సత్తిరెడ్డి, నరేష్, గంగారెడ్డి, రాజన్న, సుర శ్రీనివాస్, పోచయ్య, అంజలి, రాజిరెడ్డి, రమేష్, శ్రీకాంత్, జిల్లా మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గంగారెడ్డి, కట్ట రాజేందర్, dcc అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు బాల ముకుందం,చల్గల్ గ్రామ నాయకులు అబ్బూరి మల్లేశం గౌడ్,దాసరి సతీష్, శ్రీనివాస్, సర్పంచులు, నాయకులు,రైతులు,అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.1