Shuru
Apke Nagar Ki App…
పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటిముందు బెటాయించి ప్రియురాలు నిరసన.... మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బేటాయించిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలానికి రేకుల తండా చెందిన ఓ యువతి గుండెగ గ్రామ శివారు వాగ్యతండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడ్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించడం జరిగిందని తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటిముందు బెటాయించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు.
Chetty:Ramesh
పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటిముందు బెటాయించి ప్రియురాలు నిరసన.... మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బేటాయించిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలానికి రేకుల తండా చెందిన ఓ యువతి గుండెగ గ్రామ శివారు వాగ్యతండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడ్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించడం జరిగిందని తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటిముందు బెటాయించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బేటాయించిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలానికి రేకుల తండా చెందిన ఓ యువతి గుండెగ గ్రామ శివారు వాగ్యతండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడ్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించడం జరిగిందని తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటిముందు బెటాయించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు.1
- సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు), రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్* ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కేసముధ్రం మండలం తౌర్య తండా కు చెందిన శ్రీనివాస్ తాను గతంలో గ్రామంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు గాను MB ప్రకారం డబ్బులను ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని ప్రస్తుత సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని తన సమస్యను పరిష్కరించి తన డబ్బులను ఇప్పించగలరని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుర్రం శివకృష్ణ తాను నిరుపేద వికలాంగుడినని మా గ్రామంలో పది సంవత్సరాలుగా రేషన్ డీలర్ ఇంచార్జి గా కొనసాగుతున్నారని అందువలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తనకు రేషన్ డీలర్ ఇంచార్జీ ఇప్పించి నా కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ( 195 ) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.1
- వరంగల్ జిల్లా:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ అశోక కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు ఏకమై ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.2
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. తలకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణను, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎండీ పర్యటన సందర్భంగా పలువురు స్థానిక కార్పొరేటర్లు ఆయనను కలిసి బస్టాండ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ ఆవరణలో చుట్టూ పోల్స్ పాతి ఇనప కంచె వేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వివరించారు. ఒక బస్సు లోపలికి వచ్చినప్పుడు మరో బస్సు వెళ్లడానికి కూడా వీలులేనంత ఇరుకుగా మారిందని, దీనివల్ల ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో బస్టాండ్ ఆవరణలో వరదనీరు నిలిచిపోవడం పట్ల తీవ్రఇబ్బంది ఎదురుకుంటున్నామని తెలిపారు. పాల్వంచ బస్టాండ్ను ఆధునీకరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని వారు కోరారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఎండీ నాగిరెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా శుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాల్వంచ బస్టాండ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, దీనిని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఐపీఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక కార్పొరేటర్లు ,పలువురు నేతలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్క్రూటిపై వెళ్తున్న మహిళను బైక్ తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్క్రూటీపై వెళ్తున్న మహిళను, మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి నేను పోలీస్ అంటు దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ అయితే మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు. నీ బైక్ కు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించి మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో హంగామా సృష్టించిన కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తారని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్పల్లి కామిని హాస్పిటల్కు దానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.4
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1