Shuru
Apke Nagar Ki App…
సాల్మన్ పురంలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు..... వైఎస్ఆర్సిపి నాయకులు బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మన్ పురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు.
Shafi ahamed baig mogal
సాల్మన్ పురంలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు..... వైఎస్ఆర్సిపి నాయకులు బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మన్ పురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.1
- బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బద్వేలు, సెప్టెంబర్ 02: బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.2
- *పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. *పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1
- టీటీడీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా..? ఆ పోరులో డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్ను టార్గెట్ చేశారా..? టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్పై జరిగిన ఏసీబీ దాడుల వెనుక కుట్ర ఉందంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80 మంది అధికారులతో ఆరు నెలలపాటు విచారణ జరిపినా ఏమీ తేలలేదని, ఇప్పుడు నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న లోకనాథం యాదవ్ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక టీటీడీలో జరుగుతున్న ఆధిపత్య పోరే కారణమా అని ప్రశ్నించారు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది” అంటూ భూమన తీవ్రంగా వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రాబల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే లోకనాథం యాదవ్ను టార్గెట్ చేస్తున్నారని భూమన ఆరోపించారు. లోకనాథం యాదవ్ కుటుంబం మొదటి నుంచే ఆర్థికంగా సంపన్నమైన కుటుంబమని, ఆయన తాత మునిస్వామి యాదవ్ అప్పట్లోనే కోటీశ్వరుడని పేర్కొన్నారు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న నిజాయితీపరుడైన అధికారిపై అవినీతి మచ్చ వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “లోకనాథం యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీటీడీ ఉద్యోగులు ఆయనకు అండగా నిలవాలి. అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రశ్నించాలి” అని భూమన పిలుపునిచ్చారు. టీటీడీలో అసలు ఏం జరుగుతోంది..? అధికారుల మధ్య ఆధిపత్య పోరా..? లేక లోకనాథం యాదవ్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా..? ▶️ భూమన కరుణాకర్ రెడ్డి గారి సంచలన ప్రెస్మీట్ పూర్తి వీడియో చూడండి.1
- పాడి చెరువుకు మట్టి మాఫియా పంజా! 25 రోజులుగా జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తవ్వకాలు అనుమతులు ఉన్నాయంటున్నారు.. పత్రాలు మాత్రం కనిపించవు తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి అనంతరం ఉన్న పాడి చెరువులో 25 రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి 10 ట్రాక్టర్ల వరకు మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చెరువు స్వరూపం మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు చెబుతున్నప్పటికీ, అనుమతి పత్రాలు, తవ్వకాలకు అనుమతించిన పరిమాణం వంటి వివరాలు వెల్లడించడం లేదని స్థానికులు అంటున్నారు. అనుమతుల పరిధిలోనే తవ్వకాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతుల వివరాలను వెల్లడించాలని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- ప్రసన్న కుమార్ రెడ్డి పై విరుచుకుపడ్డ తెలుగు యువత..... బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేసే ముందు తన స్థితిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో కడిగే తమరు ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మగాడివైతే అంటూ మాట్లాడడం సమన్యాసం కాదని అన్నారు. మగతనం అంటే మాటల్లో కాదు ప్రజలకు మంచి చేయడం అని విమర్శించారు. నెల్లూరు జిల్లా ప్రజలను ఎవరు అడిగినా వేమిరెడ్డి మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం విమర్శించడం సరికాదని ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.1