Shuru
Apke Nagar Ki App…
రాష్ట్ర విద్యాశాఖ పై కేంద్రం పెత్తనం వల్లే అవకతవకలు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖపై కేంద్రం పెత్తనం వల్లే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర యూనివర్సిటీల మీద, పరీక్షల మీద కేంద్రం పెత్తనం చెలాయించడం ఆపేయాలి –రేవంత్ రెడ్డి
Sangareddy News
రాష్ట్ర విద్యాశాఖ పై కేంద్రం పెత్తనం వల్లే అవకతవకలు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖపై కేంద్రం పెత్తనం వల్లే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర యూనివర్సిటీల మీద, పరీక్షల మీద కేంద్రం పెత్తనం చెలాయించడం ఆపేయాలి –రేవంత్ రెడ్డి
More news from తెలంగాణ and nearby areas
- ఫోన్ ఎత్తలేదని స్నేహితుల వినూత్న ప్రతీకారం.. బ్యాండు మేళాతో ఇంటిపైకి దండయాత్ర! స్నేహితులు అంటేనే అల్లరి, సరదాలు, కొట్లాటలు. అయితే, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో ఓ గ్రూప్ ఫ్రెండ్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమార్ భాయ్ అనే వ్యక్తి తన స్నేహితుల ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో, వారంతా ఊరుకోకుండా వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. "కుమార్ భాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం" అంటూ వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డప్పు చప్పుళ్లు, కేరింతలతో నేరుగా అతని ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఈ ఊహించని షాక్ చూసి కుమార్ అవాక్కై, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీ ఫ్రెండ్స్ లోనూ ఫోన్ ఎత్తని వాళ్లుంటే ఈ ఫన్నీ వీడియోను వారికి వెంటనే షేర్ చేయండి!1
- DANGER: పిల్లలకు టీ, కాఫీ తాగిస్తున్నారా?.... 12ఏళ్ల లోపు పిల్లలకు టీ లేదా కాఫీలు ఇవ్వడం ఆరోగ్యానికి చాలా హానికరం అని పిల్లల వైద్యుడు గౌతమ్ హెచ్చరించారు. టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వస్తుందని చెప్పారు. అలాగే ఇది ఆకలిని తగ్గించడంతో పాటు హైపర్ యాక్టివిటీ పెరగడం, నిద్రలేమి సమస్య లకు దారితీస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య రీత్యా వీటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తగ్గిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.81,700, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.78,900, విఐపి దర్శనాల ద్వారా రూ.1,16,850, కార్ పార్కింగ్ ద్వారా రూ.2,14,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,40,390 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,58,891 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్1
- ఓవర్హెడ్ వైర్ షార్ట్ సర్క్యూట్: రైలు ప్రయాణికుల్లో భయాందోళన! BREAKING NEWS: రైల్వే ఓవర్హెడ్ విద్యుత్ లైన్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల్లో మొత్తం రైలుకు విద్యుత్ ప్రవహించి భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందా అనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇప్పటికే పటిష్టమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం రైల్వే శాఖ అత్యవసరంగా మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #IndianRailways #TrainSafety #OverheadWire #ShortCircuit #RailNews1
- సీజనల్ వ్యాధులపై వెంకటాయపల్లిలో ప్రత్యేక దృష్టి.. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేశారు. సర్పంచ్ బట్టికాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇలాంటి నివారణ చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.1
- వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి, బ్యాంకు, రైతు వేదికల ద్వారా రైతులకు యురియా అందించాలి : తెలంగాణ రైతు సంఘం. వికారాబాద్ : వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి pacs రైతు వేదికల నుండి ప్రభుత్వం రైతులకు యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ప్రభుత్వం సబ్సిడీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్లి రైతు సంఘం వికారాబాద్ నాయకులు పరిశీలించారు. రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకొని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఎరువు ధరలు కాకుండా దళారులు తమ ఇష్టానుసారంగా ఏరియాను డిఏపిని అమ్ముతున్నారని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1