మాహారాష్ట్ర నుండి తెలంగాణ కు అక్రమంగా సిద్దిపేట కు తరలిస్తున్న అడవి పందులు పట్టివేత... నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు... మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందులను బొలెరో వాహనం లో తరలిస్తున్నట్టు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు... ఇద్దరు నిందితులను పట్టుకుని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు... బొలెరో వాహనం స్వాధీనం.. అడవి పందులను బైంసా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్ కు చూపించిన తర్వాత వాటి వయసు, లింగము నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతం లో విడిచిపెడతామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు.. వాటిలో ఏవైనా చనిపోయి ఉంటే వాటిని పంచనామా చేసి ఖననం చేస్తామని తెలిపిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న బాసర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివ.. అటవీ శాఖ అధికారులు...
మాహారాష్ట్ర నుండి తెలంగాణ కు అక్రమంగా సిద్దిపేట కు తరలిస్తున్న అడవి పందులు పట్టివేత... నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు... మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందులను బొలెరో వాహనం లో తరలిస్తున్నట్టు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు... ఇద్దరు నిందితులను పట్టుకుని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు... బొలెరో వాహనం స్వాధీనం.. అడవి పందులను బైంసా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్ కు చూపించిన తర్వాత వాటి వయసు, లింగము నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతం లో విడిచిపెడతామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు.. వాటిలో ఏవైనా చనిపోయి ఉంటే వాటిని పంచనామా చేసి ఖననం చేస్తామని తెలిపిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న బాసర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివ.. అటవీ శాఖ అధికారులు...
- బోధన్లో కౌన్సిలర్ సమీర్కు చెందిన మేకల ఫారం ఘటనపై బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఐఎం నిరసన బోధన్లో కౌన్సిలర్ సమీర్కు చెందిన మేకల ఫారంపై జరిగినట్లు ఆరోపిస్తున్న విధ్వంసం, మేకల చోరీ ఘటనపై ఎంఐఎం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదృశ్యమైన కొన్ని మేకలు కాంగ్రెస్కు చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద లభించాయని కౌన్సిలర్ సమీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.1
- రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1
- ఖానాపూర్ నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు ఖానాపూర్ గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు1
- సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు1
- ధర్మ జాగృతి మహా సభ కరపత్రాలను విడుదల చేసిన మహదేవ్ స్వామీజీ బాన్సువాడ ఆగస్ట్ 04 బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిరంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాలను మంగళవారం సద్గురు మహాదేవ స్వామీజీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతకుముందు సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 9న ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మజాగృతి మహాసభ ఉంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సనాతనులందరూ తరలిరావాలని ఆయన కోరారు. సనాతన జాగృతం చేయడానికి మహాసభ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు మహాసభకు తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల నాయకులు హిందూ అభిమానులు హాజరయ్యారు.1
- నిర్మల్లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు.... నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.1
- మాహారాష్ట్ర నుండి తెలంగాణ కు అక్రమంగా సిద్దిపేట కు తరలిస్తున్న అడవి పందులు పట్టివేత... నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు... మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందులను బొలెరో వాహనం లో తరలిస్తున్నట్టు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు... ఇద్దరు నిందితులను పట్టుకుని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు... బొలెరో వాహనం స్వాధీనం.. అడవి పందులను బైంసా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్ కు చూపించిన తర్వాత వాటి వయసు, లింగము నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతం లో విడిచిపెడతామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు.. వాటిలో ఏవైనా చనిపోయి ఉంటే వాటిని పంచనామా చేసి ఖననం చేస్తామని తెలిపిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న బాసర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివ.. అటవీ శాఖ అధికారులు...1