Shuru
Apke Nagar Ki App…
రాయదుర్గంలో వైభవంగా రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగలా ప్రారంభమయ్యాయి. స్వామివారి కలసను, అశ్వాల ప్రతిమలను తలపై ఎత్తుకొని కోట ఏరియా నుండి కొండపై ఆలయం వరకు డప్పు చప్పుల్లు, మేళాలతాల నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఊరేగింపు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
PHANI JOURNALIST
రాయదుర్గంలో వైభవంగా రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగలా ప్రారంభమయ్యాయి. స్వామివారి కలసను, అశ్వాల ప్రతిమలను తలపై ఎత్తుకొని కోట ఏరియా నుండి కొండపై ఆలయం వరకు డప్పు చప్పుల్లు, మేళాలతాల నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఊరేగింపు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన స్థానికులు భయాందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవి ప్రాంతంలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారులోనే చిరుతల సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.1
- అనంతపురం అనిల్ కుమార్ గత 4 సంవత్సరాల్లో ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2 లక్షల బట్ట సంచులు ప్రజలకు ఉచితంగా పంచాడు అనంతపురం అనిల్ కుమార్. ఇందులో పాత చీరలతో చేసిన సంచులు , కాన్వాస్ బట్ట తో చేసిన సంచులు , శాటిన్ బట్టతో చేసిన సంచులు ఉండడం విశేషం దీనిద్వారా సుమారు 140 మంది టైలర్లకు ఉపాధి లభించింది తద్వారా వీరు సుమారు 18 లక్షల రూపాయలు కుట్టు కూలి గా సంపాదించారు1
- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శ్యాసన సభ్యులు నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర 30 రోజుల ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ల్లో ఒకటి రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు పడాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని , అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.1
- ఈ పవిత్ర మాసంలో చేసే ఉపవాసాలు, ప్రార్థనలు అల్లాహ్ అంగీకరించి, మీకు సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానుమన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞత తెలుపుతూ.. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు2
- పలమనేర్ జామియా ఫంక్షన్ హాల్ ఈద్గా లో ఈరోజు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లింలందరూ ప్రార్థనలు చేయడానికి సమావేశమయ్యారు.1
- *వికారాబాద్: ఘోర ప్రమాదం.* *కారు, ఆటో ఢీ!* వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతిపై ఆయన స్నేహితుడు, శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శివశంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. హనుమంతరాయ చౌదరితో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. స్నేహితుడి మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.1
- అనంత నగరంలో చెట్లు చంపిన 80 మంది మీద కేసులు పెట్టీ వారిని శత్రువులుగా చేసుకున్నాను అంటూ ఆవేదన. 40 సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్న వారు కూడా చెట్టు కోసం దూరం అయ్యారు1
- చిత్తూరు జిల్లాలో పొగాకు అక్రమ రవాణా ముఠా అరెస్ట్ చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 45 పొగాకు సంచులు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వెల్లూరు, బెంగళూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనాలను అడ్డుకొని తనిఖీలు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల్లో హాన్స్, విమల్, కూల్ లిప్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో: నేమిచంద్ సునీల్ పటేల్ శ్రీనివాసులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలు ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు1