Shuru
Apke Nagar Ki App…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బొబ్బిలి వీణను బహూకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన పీఎం మోదీకి బొబ్బిలి వీణ బహుకరించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభంలో వీణను మెచ్చుకుని సోషల్ మీడియాలో పీఎం పోస్టులు పెట్టడం వీణ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. ఏకండి వీణను తయారు చేసిన కళాకారుడు బి. మురళిను ఎమ్మెల్యే అభినందించారు. వీణల తయారీకీ కలప కొరత లేకుండా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారున్నారు.
వెంకీ నాయుడు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బొబ్బిలి వీణను బహూకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన పీఎం మోదీకి బొబ్బిలి వీణ బహుకరించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభంలో వీణను మెచ్చుకుని సోషల్ మీడియాలో పీఎం పోస్టులు పెట్టడం వీణ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. ఏకండి వీణను తయారు చేసిన కళాకారుడు బి. మురళిను ఎమ్మెల్యే అభినందించారు. వీణల తయారీకీ కలప కొరత లేకుండా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అమ్మవారిని దర్శించుకున్న 65,000 మంది భక్తులు ఒక్కరోజు ఆదాయం 17 లక్షలు కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం అశేష భక్తజనంతో కళకళలాడింది. వేకువ జాము నుంచే వందలాది వాహనాల్లో భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు..సుమారు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ పరిసరాల్లోనూ, ప్రైవేటు తోటల్లో ఉన్న కాటేజీల్లోనూ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఒక రోజు అమ్మవారికి రూ. 17.40 లక్షలు ఆదాయం వచ్చింది.. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు..1
- July in frames ✨ Farmers. Students. Youth. Women. From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.1
- బిహారీలకు ఏదైనా సాధ్యమే….🐊* ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు! బిహార్లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై వేసుకొని వెళ్తున్న వీడియో వైరలవుతోంది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో అతడే దాన్ని తాళ్లతో బంధించి మోసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తర్వాత అటవీ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని నదిలో వదిలేశారు. బిహారీలకు ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.1
- వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు1
- శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .1
- పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.1
- విద్యార్ధుల రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు.... హైదరాబాద్లోని చంపాపేట్ ఉన్న Aira Junior College విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. స్థానికులు Dial 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1