శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .
శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .
- అమ్మవారిని దర్శించుకున్న 65,000 మంది భక్తులు ఒక్కరోజు ఆదాయం 17 లక్షలు కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం అశేష భక్తజనంతో కళకళలాడింది. వేకువ జాము నుంచే వందలాది వాహనాల్లో భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు..సుమారు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ పరిసరాల్లోనూ, ప్రైవేటు తోటల్లో ఉన్న కాటేజీల్లోనూ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఒక రోజు అమ్మవారికి రూ. 17.40 లక్షలు ఆదాయం వచ్చింది.. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు..1
- అరకు: డ్రోన్ సహాకారంతో విత్తన బంతులు జల్లుతున్న అటవీ శాఖ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, అటవీశాఖ అధికారుల ఆదేశాలతో అరకు అటవీ రేంజ్ పరిదిలో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో పచ్చదనం పెంచడానికి 1.50 లక్షల సీడ్ బాల్స్ జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు FRO కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు అటవీ శాఖ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత సహకారంతో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో 50 వేల విత్తన బంతులను విసరడం జరిగిందన్నారు. మిగిలిన 1 లక్ష విత్తన బంతులను డ్రోన్ సహాకారం వెదజల్లనున్నట్లు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. శనివారం అరకులోయ మండలం, శిరగం పంచాయితీ, లంతంపాడు కొండల్లో డ్రోన్ సహకారంతో విత్తన బంతులను విసిరే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత, పెద్దలు పాల్గొన్నారు.1
- భోగాపురం పేరు ఎందుకు తొలగించారు? పాలకులు సమాధానం చెప్పాలి: భీశెట్టి బాబ్జి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి "భోగాపురం" పేరు చేర్చకపోవడాన్ని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తప్పుబట్టారు. జిల్లా ప్రజలు, భూములు ఇచ్చిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవమానించాయని ఆయన విమర్శించారు. భోగాపురం పేరును వెంటనే చేర్చాలని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, విమానాశ్రయంలో స్థానిక ప్రముఖుల పేర్లతో లాంజ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరినట్లు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు.1
- దత్తిరాజేరు:మరడాo గ్రామ దేవతలకు పసుపు కుంకుమ తో పూజలు.. దత్తిరాజేరు మండలం మరడాo గ్రామం లో ఆదివారం దేశమ్మ, ఆసిరి తల్లుల వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం పంటలకు ముందు అమ్మవార్ల పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు,కుంకుమ చీరలు, ఘాటలతో మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపసర్పంచ్ శంకర్, నరసింగరావు స్థానిక భక్తులు తదితరలు పాల్గొన్నారు.1
- వంగర : శివ్వాo రోడ్డులోని పంట పొలాలలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభo వంగర మండలం శివ్వాం రోడ్డులోని పంట పొలాలలో విద్యుత్ స్తంభం ఒక్క పక్కకి ఒరిగి ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ పంట సాగు చేస్తుండడంతో స్తంభం ఎప్పుడు కూలుతోందోనని ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్పందించి స్తంభాన్ని సరిచేయాలని విద్యుత్ అధికారులను రైతులు కోరుతున్నారు.1
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బొబ్బిలి వీణను బహూకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన పీఎం మోదీకి బొబ్బిలి వీణ బహుకరించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభంలో వీణను మెచ్చుకుని సోషల్ మీడియాలో పీఎం పోస్టులు పెట్టడం వీణ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. ఏకండి వీణను తయారు చేసిన కళాకారుడు బి. మురళిను ఎమ్మెల్యే అభినందించారు. వీణల తయారీకీ కలప కొరత లేకుండా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారున్నారు.1
- బిహారీలకు ఏదైనా సాధ్యమే….🐊* ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు! బిహార్లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై వేసుకొని వెళ్తున్న వీడియో వైరలవుతోంది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో అతడే దాన్ని తాళ్లతో బంధించి మోసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తర్వాత అటవీ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని నదిలో వదిలేశారు. బిహారీలకు ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.1
- శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .1