Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల పాలన పై ధర్నా. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందింది మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి. 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ ఆర్టిసి బస్ స్టాండ్ లో ప్రయాణికులకు వివరించిన బాజీ రెడ్డి.
Banswada news
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల పాలన పై ధర్నా. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందింది మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి. 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ ఆర్టిసి బస్ స్టాండ్ లో ప్రయాణికులకు వివరించిన బాజీ రెడ్డి.
More news from తెలంగాణ and nearby areas
- *2️⃣ days. 4️⃣ strategic gains. 1️⃣ bigger vision for India. 🇮🇳🤝🇺🇿* PM Modi’s visit to Uzbekistan went beyond diplomacy . It advanced India’s long-term energy security, economic interests and strategic partnerships. 🔹 $1.3 billion — India-Uzbekistan trade last year, up 33% in one year 🔹 $5 billion — trade target set for 2030 🔹 Long-term uranium supply secured for India’s expanding nuclear energy programme 🔹 Cooperation expanded across gold, copper, uranium and rare earths 🔹 UPI connectivity with Uzbekistan’s national payments system 🔹 Partnership upgraded to a Comprehensive Strategic Partnership 🔹 12 agreements signed in a single day 🔹 30-day visa-free travel announced for Indian citizens *Watch how PM Modi’s Uzbekistan visit advances the larger vision of a stronger, more connected and more self-reliant India. 🇮🇳*1
- పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం. ఆదిలాబాద్: సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేస్తం ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, వంశి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు, నిరుపేదలకు భోజనాలు వడ్డించి వారి ఆకలి తీర్చారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేస్తం ఫౌండేషన్ సామాజిక సేవలను అభినందించారు1
- వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : అనిల్కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు తెలంగాణ బెజ్జంకి అనిల్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద 17వ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్సార్కు నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీనవర్గాల సంక్షేమానికి వైఎస్సార్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల పాలన పై ధర్నా. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందింది మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి. 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ ఆర్టిసి బస్ స్టాండ్ లో ప్రయాణికులకు వివరించిన బాజీ రెడ్డి.1
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుదాం ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మాట్లాడారు. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించి, 'బాకీ కార్డు'తో నిరసన తెలిపారు.2
- గూడెం దేవాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, యజ్ఞ హోమాలు...... దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాలు నిర్వహించారు. కాగా గురువారంతో దేవాలయంలో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయని ఈవో శ్రీనివాస్ తెలిపారు.1
- “పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”1
- ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 02 :– *అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్* *ఇన్స్టాగ్రామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు *పత్రికా ప్రకటన* * *దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం* *ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం* *నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం* *సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు సంప్రదించాలి* *ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్టాగ్రామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. *వివరాలలో* ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ (25) S/o హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్స్టాగ్రామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో syedsameer4780 అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా Raj Led Mumbai పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్లైన్లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, Majisa Air Express ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు. ఆగస్టు 22న సమీపంలోని Majisa Air Express కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది . బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది. *అరెస్ట్ చేసిన నిందితుడు:* ప్రకాశ్ కుమార్ (22) S/o హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. స్వాధీనం చేసుకున్న ఆస్తి: 🔹 రూ 1 లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు, ఈరోజు స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.1