Shuru
Apke Nagar Ki App…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపనగుంట అన్నారం గ్రామం లో సోలార్ ప్లాంట్ దగ్గర బైక్ చిన్న పిల్లలకి ఇచ్చి 13 సంవత్సరాల పిల్లలకి ఇచ్చి పడ్డారు శిల్ప గాయాలు
Venkata laxmi Kothapalli
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపనగుంట అన్నారం గ్రామం లో సోలార్ ప్లాంట్ దగ్గర బైక్ చిన్న పిల్లలకి ఇచ్చి 13 సంవత్సరాల పిల్లలకి ఇచ్చి పడ్డారు శిల్ప గాయాలు
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.1
- तेलंगाना का यह अस्पताल जन्मजात दिल की बीमारी से पीड़ित बच्चों को देता है मुफ्त इलाज, इस नंबर पर अपॉइंटमेंट बुक करें बच्चों में जन्मजात दिल की बीमारी (CHD) में जन्म के समय दिल की बनावट से जुड़ी समस्याएं होती हैं, जो लगभग 1 प्रतिशत बच्चों को प्रभावित करती हैं. इसके लक्षणों में नीली त्वचा (सायनोसिस), तेजी से सांस लेना, ठीक से खाना न खाना, खाना खाते समय पसीना आना और वजन कम बढ़ना शामिल हैं. हालांकि कुछ कमियां गंभीर होती हैं और तुरंत देखभाल की जरूरत होती है, लेकिन कई का इलाज सर्जरी या मैनेजमेंट से किया जा सकता है. श्री सत्य साईं संजीवनी सेंटर में होता है मुफ्त इलाज इस समस्या को देखते हुए तेलंगाना के सिद्दीपेट जिले के कोंडापाका में श्री सत्य साईं संजीवनी सेंटर फॉर चाइल्ड हार्ट केयर एंड रिसर्च, जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों का मुफ्त इलाज कर रहा है, जिसमें ओपन-हार्ट सर्जरी और एडवांस्ड कार्डियक इंटरवेंशन शामिल हैं. संस्था के चेयरमैन, डॉ. सी. श्रीनिवास के अनुसार, यह अस्पताल जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों के इलाज के लिए समर्पित है. डॉ. श्रीनिवास ने कहा कि अब तक भारत और 14 दूसरे देशों के 233 बच्चों की सफलतापूर्वक ओपन-हार्ट सर्जरी हो चुकी है, जबकि 103 बच्चों को एडवांस्ड कार्डियक इंटरवेंशन मिले हैं, जिससे कुल 336 लोगों की जान बच गई है.1
- కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు 1
- గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది. ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.3
- Post by SS NEWS1
- పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి మహిళను,ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు.వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది.తక్షణమే స్పందించి తల్లీ,కొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్,డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.4
- ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- ఈ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పారదర్శకంగా పనిచేయాలని, ప్రజలతో కలిసిమెలిసి నడుచుకోవాలని ఆయన సూచించారు.1