Shuru
Apke Nagar Ki App…
తూ.గో జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య... దారుణ ఘటన తూ.గో జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP బి. విద్య వెల్లడించారు.
Alluri DurgaPrasad
తూ.గో జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య... దారుణ ఘటన తూ.గో జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP బి. విద్య వెల్లడించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తూ.గో జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP బి. విద్య వెల్లడించారు.1
- 🙏😭1
- పోలవరం జిల్లా... గంగవరం మండలం కొమరవరం గ్రామం నల్లగొండ అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఉన్నట్టు సమాచారం. తాళ్లపాలెం అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వెళ్లినట్టు తెలుస్తుంది. పెద్దపులి కదలికలపై పొలాల్లోకి వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.1
- మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్లో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మసులా బే పార్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత రంగుల హారతులు, సంగీతం, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బీచ్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. పర్యాటకులను ఆకర్షించడం, బీచ్ అభివృద్ధి లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. సభ్యులు పాల్గొని విజయంపై హర్షం వ్యక్తం చేశారు.1
- Post by వేముల నాగరాజు1
- జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.4
- *గుంటూరు బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం* గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1
- గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్ సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1