Shuru
Apke Nagar Ki App…
పోలవరం జిల్లాలో పులి వేట: రంగంలోకి దిగిన పూణే రెస్క్యూ టీమ్ రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని పోలవరం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. ఫోక్స్ పేట రేంజ్ రామన్నపాలెం గ్రామానికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, పూణే రెస్క్యూ టీమ్తో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సిస్టమ్స్ మరియు భారీ బోన్లతో పులిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో అన్నీ సిద్ధం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Vidya Sagar Tumu
పోలవరం జిల్లాలో పులి వేట: రంగంలోకి దిగిన పూణే రెస్క్యూ టీమ్ రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని పోలవరం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. ఫోక్స్ పేట రేంజ్ రామన్నపాలెం గ్రామానికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, పూణే రెస్క్యూ టీమ్తో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సిస్టమ్స్ మరియు భారీ బోన్లతో పులిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో అన్నీ సిద్ధం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
More news from Andhra Pradesh and nearby areas
- 🙏😭1
- పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులను డ్రోన్ విజువల్స్ తో పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామనాయుడు పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు.1
- 🚨 కాకినాడలో ఇంధన సంక్షోభం – భానుగుడి నుంచి SP ఆఫీస్ వరకు వాహనాల భారీ క్యూ కాకినాడ: నగరంలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో భానుగుడి జంక్షన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు పెట్రోల్, డీజిల్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుగా నిలిచిన దృశ్యాలు కనిపించాయి. పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీలర్లు “స్టాక్ లేదు” అంటూ వినియోగదారులను వెనక్కి పంపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం అందక ఆటో డ్రైవర్లు, ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతమంది వాహనదారులు రాత్రి నుంచే క్యూ లో నిలబడినట్లు సమాచారం. స్థానికులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 👉 అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Shyam1
- Post by CHIYAAN1
- 🙏😭1
- కాకినాడ జిల్లా తుని పట్టణం శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఆదివారం నాడు చేపల మార్కెట్ ను తలపించేలా మాంసాహార ప్రియులు బారులు తీరారు. చెరువులోని చేపలు పట్టి అక్కడికక్కడే వినియోగదారులకు విక్రయించడం తో స్థానికులు చేపలు కొనడానికి ఎగబడ్డారు. ఈ లైవ్ చేపలను కిలో 150 రూపాయలు చొప్పున కొనుగోలుదారులకు విక్రయించారు.1
- Post by Rai Narendra1