మనసున్న మహరాజు… కష్టజీవుల మధ్య మమేకమైన మంత్రి సత్యకుమార్ యాదవ్ కూలీలతో నేలపై కూర్చుని భోజనం… నిరాడంబరతకు నిదర్శనం కష్టజీవుల కంచంలో ఆప్యాయత వడ్డించిన జననేత ధర్మవరం/ముదిగుబ్బ, ఏప్రిల్ 19:- ప్రజల మధ్యే జీవించే నిజమైన నాయకుడిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలో పర్యటించిన సందర్భంగా మంత్రి కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, అక్కడ కష్టపడుతున్న రైతు కూలీలతో మమేకమై అందరినీ ఆకట్టుకున్నారు. ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీలు ఎండను లెక్కచేయకుండా కష్టపడుతుండటం గమనించిన మంత్రి, వెంటనే వారితో కలిసిపోయి నేలపై కూర్చుని వారితో కలిసి భోజనం చేశారు. కూలీలు తెచ్చుకున్న సాధారణ చద్దన్నాన్ని ఎంతో ఆప్యాయంగా స్వీకరించి, వారితో కలిసి ఆరగించడం ద్వారా తనలోని వినయాన్ని, నిరాడంబరతను ప్రతిబింబించారు. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే కాన్వాయ్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక సదుపాయాలు గుర్తుకు వస్తాయి. కానీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రం ఆ హోదాను పక్కన పెట్టి, సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోవడం ద్వారా ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. కష్టజీవుల మధ్య కూర్చుని వారి కష్టాలను అర్థం చేసుకోవడం, వారి జీవన విధానాన్ని పంచుకోవడం ద్వారా ఆయన నిజమైన ప్రజానాయకుడిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతు, కూలీ సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వారి కష్టం విలువైనది. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. మంత్రి గారి ఈ నిరాడంబరత, కష్టజీవుల పట్ల చూపిన ఆప్యాయత స్థానిక ప్రజల్లో మంచి స్పందనను తెచ్చింది. ఇలాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం అంటూ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
మనసున్న మహరాజు… కష్టజీవుల మధ్య మమేకమైన మంత్రి సత్యకుమార్ యాదవ్ కూలీలతో నేలపై కూర్చుని భోజనం… నిరాడంబరతకు నిదర్శనం కష్టజీవుల కంచంలో ఆప్యాయత వడ్డించిన జననేత ధర్మవరం/ముదిగుబ్బ, ఏప్రిల్ 19:- ప్రజల మధ్యే జీవించే నిజమైన నాయకుడిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలో పర్యటించిన సందర్భంగా మంత్రి కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, అక్కడ కష్టపడుతున్న రైతు కూలీలతో మమేకమై అందరినీ ఆకట్టుకున్నారు. ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీలు ఎండను లెక్కచేయకుండా కష్టపడుతుండటం గమనించిన మంత్రి, వెంటనే వారితో కలిసిపోయి నేలపై కూర్చుని వారితో కలిసి భోజనం చేశారు. కూలీలు తెచ్చుకున్న సాధారణ చద్దన్నాన్ని ఎంతో ఆప్యాయంగా స్వీకరించి, వారితో కలిసి ఆరగించడం ద్వారా
తనలోని వినయాన్ని, నిరాడంబరతను ప్రతిబింబించారు. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే కాన్వాయ్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక సదుపాయాలు గుర్తుకు వస్తాయి. కానీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రం ఆ హోదాను పక్కన పెట్టి, సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోవడం ద్వారా ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. కష్టజీవుల మధ్య కూర్చుని వారి కష్టాలను అర్థం చేసుకోవడం, వారి జీవన విధానాన్ని పంచుకోవడం ద్వారా ఆయన నిజమైన ప్రజానాయకుడిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతు, కూలీ సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వారి కష్టం విలువైనది. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. మంత్రి గారి ఈ నిరాడంబరత, కష్టజీవుల పట్ల చూపిన ఆప్యాయత స్థానిక ప్రజల్లో మంచి స్పందనను తెచ్చింది. ఇలాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం అంటూ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్గ్రామ్లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- Post by Daatha Foundation Trust1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.1
- మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.1