Shuru
Apke Nagar Ki App…
https://youtube.com/shorts/Jap3Vw4Wb_A?si=147KrkrMUG06OLQQ
Chand Basha (సప్తమందిర సముదాయం) official
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు నేటి సాయంత్రం హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల 2026 కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు బాలాజీ హాజరయి జ్యోతి ప్రద్యులన కార్యక్రమాన్ని గావించారు. చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు పండర భజన తదితర సాంప్రదాయ నృత్యాలను వచ్చిన ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి హాజరవ్వటం జరిగింది. కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యి విజయవంతంగా కొనసాగించారు. పుష్కారాలతో ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ కోసూరు రత్నం అదే క్రమంలో సిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టస్ పేరూరి ప్రదీప్ రంగారావు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉగాది ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయని వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందించారు.1
- * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు.. * పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.. విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.4
- చిత్తూరు జిల్లా, వెదురు కుప్పం మండలం, కొమరగుంట పంచాయతీ, బంధార్లపల్లి సమీపంలో మేకల బండపై బాగా కాలిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎస్పి సాయినాథ్ 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న యువకుడిని ఎక్కడో చంపి ఇక్కడ తీసుకువచ్చి పెట్రోల్ పోసి, రబ్బరు టైర్లతో కాల్చిన ఆనవాళ్లు లభించినట్లు వెల్లడి1
- గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.1
- కర్నూలు జిల్లా.. ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామశివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు... ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు... వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 8 బైకులు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు... ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు...3
- తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు నిరసన సెగ ఓ మహిళను 30 ఏళ్లుగా వేధిస్తున్న బీఆర్ నాయుడు.. తిరుమల పవిత్రతను కాపాడే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండటానికి అనర్హుడంటూ గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు గ్రాండ్ రిడ్జ్ తనదే కావడంతో.. కూటమి గుండాలని ఉసిగొల్పి తిరుపతి వైయస్ఆర్సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్పై, నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించిన బీఆర్ నాయుడు. దాంతో మహిళలకు గాయాలు కావడంతో మరింత ఉద్ధృతంగా మారిన నిరసనలు బీఆర్ నాయుడు సూచనలతో.. నిరసనకారుల్ని అరెస్ట్ చేసి తిరుచానూరు స్టేషన్కు తరలించిన పోలీసులు బీఆర్ నాయుడి బుద్ధి తెలిసి శ్రీవారి భక్తులు అసహ్యించుకుంటున్నా.. అతడ్ని వెనకేసుకొస్తున్న చంద్రబాbu1
- *మంత్రీ గారు ... మా అబ్బాయి మిస్సింగ్* *తంబళ్లపల్లె,అన్నమయ్య జిల్లా:* *విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల.* *పోలీసులు స్పందించడం లేదు ... మా బిడ్డ ఆచూకీ తెలపండి.* చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ నాలుగు రోజులుగా కనపడ్డం లేదని,ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కోరారు. జస్వంత్ రెడ్డిని తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతమ్స్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 11న రాత్రి జస్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారు అన్నారు. 12న తిరుపతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని,4 రోజులవుతున్నా స్పందించడం లేదన్నారు.1
- ఈనెల 22న రైతు భరోసా డేట్ ఫిక్స్ అని తెలిసింది, ఈ కార్యక్రమంలో రైతులకు రైతు భరోసా పథకం కింద చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్న రైతులు, ఈ వీడియోను చూడటం ద్వారా రైతు భరోసా లేటెస్ట్ న్యూస్, రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన రైతు భరోసా పథకం, రైతులకు భరోసా కల్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి వంటి నాయకులు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కాబట్టి, రైతు భరోసా పథకం గురించి మరింత సమాచారం కోసం, మా ఛానెల్ను సబ్ప్రైబ్ చేయండి, మరియు మా వీడియోలను వీక్షించండి. మేము మీకు తెలుగులో ఉత్తమ వ్యవసాయ సమాచారాన్ని అందిస్తాము1