logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో కొందరు టిడిపి నాయకులు ఓర్వలేక పోతున్నారు... -పసుపులేటి సాయి దత్త విద్యార్థి విభాగం అధ్యక్షులు, కడప జిల్లా #ysrcp #ysrcpsocialmedia #jaganmohanreddy #jaganannaconnects #jaganannakithoduga

3 hrs ago
user_P.ViswanathReddy
P.ViswanathReddy
Farmer ఎస్.మైదుకూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో AP లో DSC స్కాం పై‌ కడప లో యువత & విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో కడపలో కొందరు టిడిపి నాయకులు ఓర్వలేక పోతున్నారు... -పసుపులేటి సాయి దత్త విద్యార్థి విభాగం అధ్యక్షులు, కడప జిల్లా #ysrcp #ysrcpsocialmedia #jaganmohanreddy #jaganannaconnects #jaganannakithoduga

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ వివరించారు.
    1
    గండికోట నుంచి మైలవరానికి 5,000 క్యూసెక్కుల నీటి విడుదల
జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేసినట్లు ఈ ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 17.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని
ఈఈ వివరించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం... ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు) బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....
    1
    శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ NDA కార్యాలయంలో జరిగిన బీజేపి BLA-2 కార్యశాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపి SIR జోనల్ ఇంచార్జ్.. జల్లి మధుసూదన్ గారు మరియు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపి ఇంచార్జ్.. కునిగిరి నీలకంఠ గారి మీడియా సమావేశం...


ఈ సమావేశంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తున్న నిధులు గురించి వివరించారు
ఈ కార్యక్రమంలో ధర్మవరం అసెంబ్లీ మరియు ఎన్డీఏ కార్యాలయం ఇంచార్జ్ (ఖగోలు హరీష్ బాబు గారు) 
రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ( గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు)
బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు గారు 
మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు
మరియు BLA -2 లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యశాలను విజయవంతం చేశారు....
    user_Pv sivakumar
    Pv sivakumar
    Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • టీచింగ్ ఉద్యోగాలు 👌జీతం :2,18,700₹. అర్హత :డిగ్రీ, పీజీ, Phd. #shorts #teachingjobs #facultyjobs 🤝🤝.
    1
    టీచింగ్ ఉద్యోగాలు 👌జీతం :2,18,700₹. అర్హత :డిగ్రీ, పీజీ, Phd. #shorts #teachingjobs #facultyjobs 🤝🤝.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Dhone, Nandyal•
    9 hrs ago
  • గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం వైభవం నంద్యాల: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణం కోసం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి, శ్రీచక్రానికి శాకాలతో సహస్రనామార్చనలు, శాక నివేదనం, శాకహారతులు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బి నగర్ మార్కెట్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి బృందం, కర్నూలు మార్కెట్‌కు చెందిన గిరిధర్ బృందం సుమారు 2 వేల కిలోలకుపైగా కూరగాయలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.
    3
    గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం వైభవం
నంద్యాల: గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి శాకాంబరీ ఉత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణం కోసం ఘనంగా నిర్వహించారు.
అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి, శ్రీచక్రానికి శాకాలతో సహస్రనామార్చనలు, శాక నివేదనం, శాకహారతులు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బి నగర్ మార్కెట్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి బృందం, కర్నూలు మార్కెట్‌కు చెందిన గిరిధర్ బృందం సుమారు 2 వేల కిలోలకుపైగా కూరగాయలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    13 hrs ago
  • అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    1
    అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పులివెందుల లో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా పల్లకి ఉత్సవం గురు పౌర్ణమి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.మహిళలు సాయిబాబా పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే ఆలయంలో తాళాల భజనలు అందర్నీ ఆకట్టుకుంది. సాయిబాబా పల్లకి ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అలరించింది.
    1
    పులివెందుల లో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా పల్లకి ఉత్సవం
గురు పౌర్ణమి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.మహిళలు సాయిబాబా పల్లకిని మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే ఆలయంలో తాళాల భజనలు అందర్నీ ఆకట్టుకుంది. సాయిబాబా పల్లకి
ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శన అలరించింది.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింపు.. ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులు నంద్యాల జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి బుధవారం శ్రీశైలం జలాశయానికి 14,260 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 42.8708 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    1
    శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగింపు.. ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులు
నంద్యాల జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి బుధవారం శ్రీశైలం జలాశయానికి 14,260 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.  శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 822.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 42.8708 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి -అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ... ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్‌నినో కరవు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి
-అధికారులకు బిసి సంక్షేమ,చేనేత శాఖ మంత్రి ఆదేశం
పుట్టపర్తి :-ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత శాఖ మంత్రి  ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. 
జిల్లా కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు కరవు నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంసిద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ...
ఎల్‌నినో కరవు పరిస్థితుల ఎదుర్మానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి.సూపర్ ఎల్‌నినో కరవు ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.మంత్రి సవిత
అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో కరవు పరిస్థితులను ఎదుర్కోవాలి.జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గ్రామీణ మంచి నీటి సరఫరా (RWS) అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలి. సమస్యాత్మక గ్రామాలను ముందే గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. చేతిపంపుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.కరవు కాలంలో మూగజీవాలకు పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు సైలేజ్, ఎండుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలి.
ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కూలీలకు క్రమం తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించేలా ఉపాధి పనులను వేగవంతం చేయాలని, సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు
సమన్వయంతో ప్రతివారం గ్రామస్థాయి పరిస్థితులను సమీక్షించుకోవాలి. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజాఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* 
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత లేదా కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం మరియు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు సమగ్ర ప్రణాళికను రూపొందించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎండ తీవ్రత, భూగర్భ జలాల మట్టాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించాం. బోర్ల రీబోరింగ్, పైప్‌లైన్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశాం.కరవు ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు ఉపాధి హామీ పనులు, మూగజీవాలకు పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. 
ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆత్మకూరులో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు ఆత్మకూరు పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ నుండి ఆత్మకూరుకు కూరగాయల లోడు తో వచ్చిన ఐచర్ వాహనం నంద్యాల టర్నింగ్లో ఓ కుక్కను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.
    1
    ఆత్మకూరులో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు 
ఆత్మకూరు పట్టణంలో బుధవారం తెల్లవారుజామున  పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ నుండి ఆత్మకూరుకు కూరగాయల లోడు తో వచ్చిన ఐచర్ వాహనం నంద్యాల టర్నింగ్లో ఓ కుక్కను తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.